గాలికి మెటల్ షీట్లు పడి వాహనం ధ్వంసం.. BD4,814 పరిహారం..!!
- December 29, 2024
మనామా: తుఫాను సమయంలో చేలరేగిన గాలుల తీవ్రతకు ఇనుప షీట్లు పడిపోవడం వల్ల వాహనం దెబ్బతిన్నందుకు GCC పౌరుడికి BD4,814 పరిహారం చెల్లించాలని హై సివిల్ కోర్టు ఒక బీమా కంపెనీని ఆదేశించింది. ఈ ఏడాది మార్చిలో అతను హూరా హోటల్ ముందు వాహనం ఆపి ఉండగా ఈ ఘటన జరిగింది. తన క్లయింట్ తన కారును హోటల్లోని నిర్దేశిత పార్కింగ్ ఏరియాలో పార్క్ చేసినట్లు అతడి తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు. ఆ రోజు రాత్రి బలమైన గాలుల సమయంలో హోటల్ నుండి మెటల్ షీట్లు పడిపోయాయని, దీని వలన వాహనానికి BD30,000 నష్టం జరిగిందని చెప్పారు. తుది తీర్పులో బీడీ4,814 పరిహారం చెల్లించాలని బీమా కంపెనీని ఆదేశించింది.
తాజా వార్తలు
- దుబాయ్లో కొత్త అల్ ఖుద్రా బ్రిడ్జి ప్రారంభం..
- బోనాల ఉత్సవాల్లో AI కెమెరాలతో అప్రమత్తమైన నిఘా:సీపీ సజ్జనార్
- రియాద్లో మృత్యువుతో పోరాడుతున్న ఏపీ వాసి.. లక్ష్మీనారాయణకు తెలుగు సంఘాల అండ
- వైజాగ్ సినీ ప్రియులకు గుడ్ న్యూస్..
- బోనమెత్తిన హైదరాబాద్
- వాహనదారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
- సైబరాబాద్లో వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్.. 311 మంది పై కేసులు
- ఇరాన్–అమెరికా మధ్య చర్చలు లేవు: విదేశాంగ మంత్రి అరాఘ్చీ
- భారత చేనేత వారసత్వానికి అంకితంగా ‘జాతీయ చేనేత సమ్మేళనం–2026’
- 4వ బెటాలియన్ను సందర్శించిన డీజీపీ సి.వి.ఆనంద్







