బెల్టులో పది కిలోల బంగారం స్మగ్గింగ్
- February 06, 2025
న్యూ ఢిల్లీ: బెల్టులో రహస్యంగా బంగారు నాణాలను దాచి తీసుకొచ్చిన ఇద్దరు ప్రయాణికులను ఢిల్లీ కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. మిలాన్ నుంచి వచ్చిన ఈ ప్రయాణికులు ఇద్దరి వద్ద కలిపి మొత్తం పది కిలోల బంగారు నాణాలను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం రాత్రి జరిపిన తనిఖీలలో ఈ స్మగ్గింగ్ దందా బయటపడిందని ఢిల్లీ ఎయిర్ పోర్టు అధికారులు చెప్పారు.
ఇటలీలోని మిలాన్ నుంచి వచ్చిన విమానంలో ఇద్దరు ప్రయాణికుల ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించడంతో అధికారులు తనిఖీ చేశారు. లగేజీ క్షుణ్ణంగా సోదా చేసినా ఏమీ కనిపించలేదు. దీంతో మరోసారి తనిఖీ చేయగా.. ప్రత్యేకంగా డిజైన్ చేసిన బెల్టులు కనిపించాయని అధికారులు తెలిపారు. వాటిలో రహస్యంగా దాచి తీసుకొచ్చిన బంగారు నాణాలు బయటపడ్డాయని చెప్పారు.
వాటిని తూకం వేయగా 10.092 కిలోలు ఉన్నాయని, మార్కెట్ లో ఆ నాణాల విలువ రూ.7.8 కోట్లకు పైనే ఉంటుందని తెలిపారు. ఈ బంగారు నాణాలకు సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో వాటిని సీజ్ చేసి, ప్రయాణికులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. పట్టుబడ్డ ప్రయాణికులు ఇద్దరూ కశ్మీర్ కు చెందిన వారేనని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







