ఇందిరమ్మ ఇళ్ల తాజా అప్డేట్
- February 09, 2025
హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు ప్రభుత్వం రోజుకో కొత్త సమాచారం అందిస్తోంది.తాజాగా, అందిన దరఖాస్తులను అధికారులు మూడు జాబితాలుగా విభజించారు. వాటిని ఎల్-1, ఎల్-2, ఎల్-3 అని వర్గీకరించారు. ఈ జాబితాల ప్రకారం, మొదటి విడతలో సొంత స్థలం ఉన్నవారికి ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేయనుందని స్పష్టమైన ప్రకటన వచ్చింది.
జాబితా విభజన ఇలా ఉంది: ఎల్-1 జాబితాలో సొంత స్థలంలో గుడిసె, పూరిపాక, మట్టిమిద్దెలు, రేకుల ఇళ్లలో నివాసముంటున్న వారిని చేర్చారు. ఎల్-2 జాబితాలో సొంత స్థలం లేక, పూర్తిగా ఇల్లు లేనివారు ఉన్నారు.ఎల్-3 జాబితాలో ఇప్పటికే ఇల్లు ఉన్నప్పటికీ, ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఉన్నారు.మొత్తంగా పరిశీలించిన దరఖాస్తుల ప్రకారం ఎల్-1 జాబితాలో 21.93 లక్షలు, ఎల్-2 జాబితాలో 19.96 లక్షలు, ఎల్-3 జాబితాలో 33.87 లక్షలు ఉన్నారు. మొదటి విడతలో 562 గ్రామాల నుంచి 71,482 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. వీరిలో ఎల్-1 నుంచి 59,807 మంది, ఎల్-2 నుంచి 1,945 మంది, ఎల్-3 నుంచి 5,732 మంది, కొత్త దరఖాస్తుల నుంచి 3,998 మంది ఉన్నారు.
ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విధంగా, మొదటి విడతలో ప్రధానంగా సొంత స్థలం ఉన్నవారికే ఇళ్లు మంజూరు చేయనుంది. మిగిలిన ఎల్-1, ఎల్-2 జాబితాలోని లబ్ధిదారులు తర్వాతి విడతల్లో ప్రాధాన్యం పొందనున్నారు. అయితే, ఎల్-3 జాబితాలో 33.87 లక్షల మంది దరఖాస్తుదారులలో చాలా మంది ఇందిరమ్మ ఇళ్లకు అనర్హులుగా గుర్తించినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాలతో లబ్ధిదారుల్లో కొంత నిరాశ వ్యక్తమవుతోంది. ప్రత్యక్షంగా ఇళ్లు అవసరమైన వారు ముందుగా ప్రాధాన్యత పొందడం న్యాయం అయినప్పటికీ, మిగిలిన వారికి కూడా సముచిత న్యాయం చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. ఇకపై ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలు ప్రకటిస్తుందో చూడాలి.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









