వేగంతో వీస్తున్న గాలులు.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు.. భయాందోళనలో జనం..
- May 02, 2018
అండమాన్ ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అలాగే మహారాష్ట్ర నుంచి కర్నాటక మీదుగా తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి, రాజస్థాన్ నుంచి పశ్చిమ బెంగాల్ మీదుగా మణిపూర్ వరకు మరో అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. వీటన్నంటి ప్రభావంతో కోస్తాంధ్రలో చాలాచోట్ల విస్తారంగా వర్షాలు పడ్తున్నాయి. తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. వేటకెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. పార్వతీపురంలో గంటకు పైగా కుండపోతగా వర్షం పడింది. దీంతో రోడ్లు చెరువులను తలపించాయి. పిడుగులు పడడంతో జనం తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. గజపతినగరం, మెంటాడ, బొండపల్లి, దత్తిరాజేరు మండలాల్లో ఏకధాటిగా వర్షం పడింది. ఏజేన్సీ ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







