18న శనివారం జూబ్లీహిల్స్ మెట్రో స్టేషన్ ప్రారంభం
- May 17, 2019అమీర్పేట టూ హైటెక్ సిటీ మెట్రో మార్గం మొత్తం క్లియర్ అయ్యింది. పెండింగ్ లో ఉన్న, కీలకమైన జూబ్లీహిల్స్ మెట్రో స్టేషన్ ను ప్రారంభించటానికి ముహూర్తం ఖరారు చేశారు. 2019, మే 18వ తేదీ శనివారం ఉదయం నుంచి సర్వీసులు ప్రారంభించనున్నారు. ఈ మార్గంలో మెట్రో సర్వీసులు మార్చి 20న ప్రారంభం అయ్యాయి.
మాదాపూర్, పెద్దమ్మతల్లి, జూబ్లీహిల్స్ చెక్పోస్టు మెట్రోస్టేషన్లలో సర్వీసులకు బ్రేక్ పడింది. విడతల వారీగా మొదట మాదాపూర్, ఆ తర్వాత పెద్దమ్మతల్లి స్టేషన్లను ప్రారంభించారు. మిగిలిన ఒకే ఒక్క జూబ్లీహిల్స్ స్టేషన్ ను మాత్రం మే 18, శనివారం నుంచి ఓపెన్ చేస్తున్నారు. ఈ స్టేషన్ ప్రారంభంతో నాగోల్ నుంచి హైటెక్ సిటీ మధ్యలో అన్ని స్టేషన్లు అందుబాటులోకి వచ్చినట్లే.
అమీర్ పేట టూ హైటెక్ సిటీ మధ్యలో స్టేషన్లు :
1. మధురానగర్
2. యూసఫ్ గూడ
3. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్-5
4. జూబ్లీహిల్స్ చెక్ పోస్టు
5. పెద్దమ్మతల్లి గుడి
6. మాదాపూర్
7. దుర్గంచెరువు
8. హైటెక్ సిటీ
తాజా వార్తలు
- 3 గ్లోబల్ హెల్త్ అవార్డులను అందుకున్న ఒమన్
- పెంపుడు జంతువుతో ప్రయాణిస్తున్నారా? అనుమతి, ప్రక్రియ, వ్యాక్సిన్ల వివరాలు
- అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, సిక్కింలో ఎస్కేఎం విజయ దుందుభి..
- ఖతార్ లో 1.2 మిలియన్ చదరపు మీటర్ల గ్రీనరీ పునరుద్ధరణ
- కువైట్ కొత్త క్రౌన్ ప్రిన్స్గా షేక్ సబా అల్-ఖాలీద్ అల్-సబా
- సోషల్ మీడియాలో మోసపూరిత ప్రచారం..ఇద్దరు అరెస్ట్
- దుబాయ్ లో సింగిల్ యూజ్ బ్యాగ్లపై నిషేధం ప్రారంభం
- నేటి నుంచి టోల్ ఛార్జీలు పెంపు
- నూతన కార్యవర్గాన్ని ప్రకటించిన NATS
- తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డికి అమెరికాలో సత్కారం