అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, సిక్కింలో ఎస్కేఎం విజయ దుందుభి..
- June 02, 2024
అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది. మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకు గాను 46 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. నేషనల్ పీపుల్స్ పార్టీకి 5 సీట్లు వచ్చాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి 3 సీట్లు, పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ కి 2 సీట్లు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి ఒక సీటు, స్వతంత్ర అభ్యర్థులు 3 సీట్లు దక్కాయి. అరుణాచల్ ప్రదేశ్ లో బీజేపీ అధికారంలోకి రావడం ఇది వరుసగా మూడోసారి.
ఈటానగర్ సహా పలు ప్రాంతాల్లో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. కాగా, ఇవాళ ఉదయం 6 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగింది. మే4న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రానున్న విషయం తెలిసిందే. రెండు రోజుల ముందే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ జరిగింది.
సిక్కింలో రెండోసారి ఎస్కేఎం విజయం
ఇక సిక్కింలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా వెలువడ్డాయి. ఆ రాష్ట్రంలో అధికార సిక్కిం క్రాంతికారి మోర్చా రెండోసారి అధికారంలోకి వచ్చింది. మొత్తం 32 సీట్లలో ఆ పార్టీ 31 స్థానాలను గెలుచుకోగా, సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ ఒకటి గెలుచుకుంది. ఆ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 16 సీట్లు అవసరం. ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ రెనాక్ అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికలలో విజయం సాధించారు.
తాజా వార్తలు
- సౌదీ ఎయిర్పోర్ట్స్లో ఇక పై పక్కా నిఘా
- చెన్నైలో పల్స్ పోలియోను ప్రారంభించిన సీఎం విజయ్!
- తెలంగాణలో నేడు ఈ జిల్లాల్లో వానల హెచ్చరిక..
- మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న సోనూ సూద్..
- TTDకి అనంత్ అంబానీ 25 ఎలక్ట్రిక్ బస్సుల విరాళం
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..ఒక్కరికే Dh100,000 సొంతం..!!
- సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై ఖతార్ ఎయిర్వేస్ క్లారిటీ..!!
- లూలూలో భారీ టెక్ డీల్స్..‘లెట్స్ కనెక్ట్’ టెక్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- ICRF సమ్మర్ అవేర్నెస్..200 మంది కార్మికులకు ప్రయోజనం..!!
- విషాదం..సైనికుడి మృతికి యూఏఈ సంతాపం..!!







