ఉచితంగా 4,500 ల గుండె ఆపరేషన్ లు చేయించిన మహేశ్ బాబు
- March 18, 2025
అమరావతి: గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు సూపర్ స్టార్ మహేశ్ బాబు ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తోన్న విషయం తెలిసిందే. మహేశ్ బాబు ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అయితే, ఈ సంఖ్య సోమవారంతో 4,500 దాటినట్లు ఆంధ్రా హాస్పిటల్స్ ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఘట్టమనేని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు. తమ అభిమాన హీరో చేస్తున్న సమాజ సేవ పట్ల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అటు మహేశ్ బాబు అర్ధాంగి నమ్రతా శిరోద్కర్ ఏపీలో మదర్స్ మిల్క్ బ్యాంక్తో పాటు బాలికలకు ఉచితంగా గర్భాశయ క్యాన్సర్ టీకాను అందించే కార్యక్రమాన్ని తాజాగా ప్రారంభించారు. మహేశ్ బాబు ఫౌండేషన్ పిల్లల హార్ట్ ఆపరేషన్లను కొనసాగిస్తుందని ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ విజేతలు..9వేల మంది విజేతలు..!!
- అనుమానాస్పద కార్యకలాపాలను నివేదించాలని ఖతార్ పిలుపు..!!
- నువైసీబ్ బార్డర్ క్రాసింగ్ను సందర్శించిన ప్రధానమంత్రి..!!
- సౌదీలో వారంలో 15,339 మంది అరెస్టు..!!
- ఒమన్ లో ఫైర్ వర్క్స్ కు వ్యతిరేకంగా హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్, సౌదీలో ఏప్రిల్ ఫార్ములా 1 రేసులు రద్దు..!!
- సజా ఇండస్ట్రియల్ ఏరియాలో అగ్ని ప్రమాదం..!!
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!









