దుబాయ్, అబుదాబిలోని కొన్ని ప్రాంతాలలో పొగమంచు..!!
- March 18, 2025
యూఏఈ: మంగళవారం తెల్లవారుజామున యూఏఈలోని కొన్ని ప్రాంతాలలో దగ్టమైన పొంగమంచు ఏర్పడింది.దీని కారణంగా వాహనదారులు పనికి వెళ్లేందుకు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. దుబాయ్, అబుదాబి, అల్ ఐన్ ప్రాంతాలలో దట్టమైన పొగమంచు ఏర్పడిందని జాతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కోసం వాతావరణ శాఖ రెడ్, ఎల్లో హెచ్చరికలను కూడా జారీ చేసింది. ఈ ప్రాంతాలలో లో విజిబిలిటీ ఉంటుందని నివాసితులను హెచ్చరించింది. వాహనదారులందరూ జాగ్రత్తగా ఉండాలని అబుదాబి పోలీసులు పిలుపునిచ్చారు. పొగమంచు కారణంగా లో విజిబిలిటీ ఉంటుందని, డ్రైవర్లు జాగ్రత్తగా ఉండాలని షార్జా పోలీసులు కూడా కోరారు.
NCM ప్రకారం.. రోజంతా పరిస్థితులు తేలికగా ఉంటాయి. నైరుతి నుండి వాయువ్య దిశలకు తేలికపాటి నుండి మితమైన గాలులు వీస్తాయి. గాలులు గంటకు 10 నుండి 20 కి.మీ. వేగంతో, అప్పుడప్పుడు గంటకు 35 కి.మీ. వేగంతో చేరుకుంటాయని అంచనా వేస్తున్నారు. రాత్రి సమయాల్లో తీరప్రాంతాల్లో తేమ పెరుగుతుందని, ఈ వీకెండ్ వరకు తేమతో కూడిన పరిస్థితులు కొనసాగుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. పర్వత ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 9°C కనిష్ట స్థాయికి పడిపోవచ్చని, అంతర్గత ప్రాంతాలలో గరిష్టంగా 33°C కి చేరుకుంటాయని తెలిపింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







