దుబాయ్, అబుదాబిలోని కొన్ని ప్రాంతాలలో పొగమంచు..!!
- March 18, 2025
యూఏఈ: మంగళవారం తెల్లవారుజామున యూఏఈలోని కొన్ని ప్రాంతాలలో దగ్టమైన పొంగమంచు ఏర్పడింది.దీని కారణంగా వాహనదారులు పనికి వెళ్లేందుకు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. దుబాయ్, అబుదాబి, అల్ ఐన్ ప్రాంతాలలో దట్టమైన పొగమంచు ఏర్పడిందని జాతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కోసం వాతావరణ శాఖ రెడ్, ఎల్లో హెచ్చరికలను కూడా జారీ చేసింది. ఈ ప్రాంతాలలో లో విజిబిలిటీ ఉంటుందని నివాసితులను హెచ్చరించింది. వాహనదారులందరూ జాగ్రత్తగా ఉండాలని అబుదాబి పోలీసులు పిలుపునిచ్చారు. పొగమంచు కారణంగా లో విజిబిలిటీ ఉంటుందని, డ్రైవర్లు జాగ్రత్తగా ఉండాలని షార్జా పోలీసులు కూడా కోరారు.
NCM ప్రకారం.. రోజంతా పరిస్థితులు తేలికగా ఉంటాయి. నైరుతి నుండి వాయువ్య దిశలకు తేలికపాటి నుండి మితమైన గాలులు వీస్తాయి. గాలులు గంటకు 10 నుండి 20 కి.మీ. వేగంతో, అప్పుడప్పుడు గంటకు 35 కి.మీ. వేగంతో చేరుకుంటాయని అంచనా వేస్తున్నారు. రాత్రి సమయాల్లో తీరప్రాంతాల్లో తేమ పెరుగుతుందని, ఈ వీకెండ్ వరకు తేమతో కూడిన పరిస్థితులు కొనసాగుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. పర్వత ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 9°C కనిష్ట స్థాయికి పడిపోవచ్చని, అంతర్గత ప్రాంతాలలో గరిష్టంగా 33°C కి చేరుకుంటాయని తెలిపింది.
తాజా వార్తలు
- సౌదీలో డ్రోన్ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!







