నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు..
- March 25, 2025
అమరావతి: ఏపీలోని నిరుద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారు. రెండు రోజులపాటు జరిగే కలెక్టర్ల సదస్సు మంగళవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ మెగా డీఎస్సీపై క్లారిటీ ఇచ్చారు. ఏప్రిల్ మొదటి వారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు చెప్పారు. 16,147 ఉద్యోగాలను భర్తీ చేస్తామని, జూన్ నెలలో పాఠశాలల ప్రారంభం నాటికి నియామకాలు పూర్తికావాలని కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు పేర్కొన్నారు.
మెగా డీఎస్సీ ద్వారా మొత్తం 16,347 పోస్టులను భర్తీ ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఆయా జిల్లాల్లోని స్థానికులతోనే 80శాతం ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో పాఠశాల విద్యా శాఖ పరిధిలో 13,661 పోస్టులు, ఎస్సీ సంక్షేమ శాఖ పరిధిలో 439, బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 170, ఎస్టీ సంక్షేమ శాఖ పరిధిలో 2024 ఖాళీలు ఉన్నాయి. అలాగే విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ పరిధిలో 49, బాల నేరస్తులకు విద్యా బోధనకోసం 15 టీచర్ పోస్టులు ఉండనున్నాయి.
తాజా వార్తలు
- కార్మికుల ఆరోగ్యం, భద్రతకే ప్రాధాన్యత..!!
- దుబాయ్లోని ఈ మేజర్ ఆకర్షణలు సమ్మర్ లో మూసివేత..!!
- కువైట్ లో విమాన రాకపోకలలో గణనీయమైన వృద్ధి..!!
- అమ్మన్లో సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రుల భేటీ..!!
- రైతులకు ఒమన్ ఫ్లోర్ మిల్స్ గుడ్ న్యూస్..!!
- బహ్రెయిన్ లో ఇకపై ఇంగ్లిష్ లోనూ నోటరైజేషన్..!!
- యూఏఈలో ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు బుకింగ్లు ప్రారంభం..
- గ్రీన్కార్డ్ హోల్డర్లకు బిగ్షాక్..!
- సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్..సీఐ నాగరాజు అరెస్ట్
- దుబాయ్లో అద్దెదారులకు ఊరట.. ‘ఫ్లెక్సీ రెంట్’ పథకం ప్రారంభం







