మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- March 14, 2026
మస్కట్: మస్కట్ గవర్నరేట్లోని అనేక ప్రదేశాలలో మరిన్ని ఎలక్ట్రిక్ వెహికల్ (EV) ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి వచ్చాయి. అల్ ఖువైర్ స్క్వేర్ మరియు సీబ్ విలాయత్లోని గ్రీన్ వాక్వే లలో కొత్త ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్టు మస్కట్ .మునిసిపాలిటీ తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాల మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం మరియు పర్యావరణ అనుకూల రవాణా వినియోగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా కొత్తగా ఎలక్ట్రిక్ వెహికల్ (EV) ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్టు మునిసిపాలిటీ వెల్లడించింది.
2025లో ఒమన్ సుల్తానేట్లోని వివిధ గవర్నరేట్లలో 160 ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జర్లను ఏర్పాటు చేశామని, 2026లో 200 ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు రవాణా, కమ్యూనికేషన్లు మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MTCIT) తెలిపింది.
గ్రీన్ మొబిలిటీ వెబ్సైట్ ప్రకారం.. ఒమన్ సుల్తానేట్లో 2,200 ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి. 160 ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. వీటిలో దోఫర్ గవర్నరేట్లో 12, నార్త్ అల్ బటినాలో 10, అల్ వుస్తాలో నాలుగు, అల్ ధకిలియాలో ఎనిమిది మరియు మస్కట్లో 49 ఉన్నాయి. 2027 నాటికి 350 ఛార్జింగ్ స్టేషన్లను కొత్తగా ఏర్పాటు చేయాలన్న ప్రణాళిక ఉందని MTCIT తెలిపింది.
తాజా వార్తలు
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్
- CJP తీరు పై స్టూడెంట్స్ విమర్శలు!
- సౌదీలో కొత్త హౌజింగ్ నిర్మాణ విధానానికి కేబినెట్ ఆమోదం..!!
- కువైట్లో నకిలీ ప్రభుత్వ స్టాంపుల ముఠా గుట్టురట్టు..!!
- యూఏఈలో వర్కర్లను నియమించుకునే వారికి కీలక సూచనలు..!!
- అమీర్తో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు..!!
- ఒమాన్లో ఆగస్టులో ఎండల తీవ్రత అధికం..!!
- షిర్డీ సాయిబాబాకు బంగారు ‘రామ్’ అక్షరాన్ని కానుకగా సమర్పించిన దుబాయ్ భక్తులు
- 25 టన్నుల కల్తీ మసాలా దినుసులు సీజ్ : సిపి సజ్జనార్
- మద్యం మత్తులో డ్రైవింగ్.. బహ్రెయిన్లో ఘోర ప్రమాదం







