SR3.8 మిలియన్ల ఫైన్ విధించిన ఏవియేషన్ అథారిటీ..!!
- March 27, 2025
రియాద్ : సౌదీ అరేబియా జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (GACA).. 2025 మొదటి త్రైమాసికంలో పౌర విమానయాన నిబంధనలను ఉల్లంఘించినందుకు మొత్తం SR3.8 మిలియన్ల జరిమానాలు విధించింది. ఈ మేరకు అధికార ఉల్లంఘనల కమిటీ నివేదిక విడుదల చేసింది.
అధికార యంత్రాంగం నిర్దేశించిన ఆదేశాలను పాటించడంలో విఫలమైన విమానయాన సంస్థలు, వ్యక్తిగత ప్రయాణికులపై జారీ చేసిన 147 ఉల్లంఘనలను నివేదిక వివరించింది.
అడ్వాన్స్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ను అమలు చేయడంలో విఫలమైనందుకు మరియు పోటీ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు రెండు విమానయాన సంస్థలకు మొత్తం SR15,000 జరిమానా విధించారు. ప్రయాణీకుల ప్రయాణ పత్రాలను సరిగ్గా ధృవీకరించని లేదా వారికి కేటాయించిన సమయాలను పాటించని విమానయాన సంస్థలకు మరో 63 ఉల్లంఘనలు జారీ చేశారు. ఫలితంగా SR1 మిలియన్ కంటే ఎక్కువ జరిమానాలు విధించారు. అదే సమయంలో ప్రయాణీకుల హక్కుల రక్షణ చట్టాలకు సంబంధించిన 61 ఉల్లంఘనలు నమోదు కాగా, SR2.7 మిలియన్లకు పైగా జరిమానాలు విధించారు. అదనంగా, విమానంలో భద్రతా నిబంధనలను ఉల్లంఘించినందుకు, విమానంలో అంతరాయం కలిగించే ప్రవర్తనకు పాల్పడినందుకు 21 మంది వ్యక్తిగత ప్రయాణికులకు మొత్తం SR12,400 జరిమానా విధించారు.
తాజా వార్తలు
- IPL2026: ఢిల్లీ క్యాపిటల్స్ పై కోల్కతా నైట్ రైడర్స్ ఘనవిజయం
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ప్రారంభించిన అపోలో హాస్పిటల్స్
- యూఏఈలో ప్రత్యక్ష లేదా దూర విద్య పై మే 10న నిర్ణయం
- విదేశీ చదువులకు పావలా వడ్డీ రుణాలు..సీఎం కీలక నిర్ణయం
- పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా మళ్లీ రంగస్వామి
- ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- యూఏఈ: రెండు బాలిస్టిక్ క్షిపణులు, మూడు డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థ
- ‘విజయ్ అను నేను‘ అంటూ రేపు విజయ్ సీఎం గా ప్రమాణ స్వీకారం
- పని మనుషులతో జాగ్రత్త: సీపీ సజ్జనార్
- యువతి ప్రాణాలను కాపాడిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు









