SR3.8 మిలియన్ల ఫైన్ విధించిన ఏవియేషన్ అథారిటీ..!!
- March 27, 2025
రియాద్ : సౌదీ అరేబియా జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (GACA).. 2025 మొదటి త్రైమాసికంలో పౌర విమానయాన నిబంధనలను ఉల్లంఘించినందుకు మొత్తం SR3.8 మిలియన్ల జరిమానాలు విధించింది. ఈ మేరకు అధికార ఉల్లంఘనల కమిటీ నివేదిక విడుదల చేసింది.
అధికార యంత్రాంగం నిర్దేశించిన ఆదేశాలను పాటించడంలో విఫలమైన విమానయాన సంస్థలు, వ్యక్తిగత ప్రయాణికులపై జారీ చేసిన 147 ఉల్లంఘనలను నివేదిక వివరించింది.
అడ్వాన్స్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ను అమలు చేయడంలో విఫలమైనందుకు మరియు పోటీ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు రెండు విమానయాన సంస్థలకు మొత్తం SR15,000 జరిమానా విధించారు. ప్రయాణీకుల ప్రయాణ పత్రాలను సరిగ్గా ధృవీకరించని లేదా వారికి కేటాయించిన సమయాలను పాటించని విమానయాన సంస్థలకు మరో 63 ఉల్లంఘనలు జారీ చేశారు. ఫలితంగా SR1 మిలియన్ కంటే ఎక్కువ జరిమానాలు విధించారు. అదే సమయంలో ప్రయాణీకుల హక్కుల రక్షణ చట్టాలకు సంబంధించిన 61 ఉల్లంఘనలు నమోదు కాగా, SR2.7 మిలియన్లకు పైగా జరిమానాలు విధించారు. అదనంగా, విమానంలో భద్రతా నిబంధనలను ఉల్లంఘించినందుకు, విమానంలో అంతరాయం కలిగించే ప్రవర్తనకు పాల్పడినందుకు 21 మంది వ్యక్తిగత ప్రయాణికులకు మొత్తం SR12,400 జరిమానా విధించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







