ముస్లిం లకు ఈద్ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ….
- March 31, 2025
న్యూ ఢిల్లీ: ముస్లింలకు ప్రధాని మోడీ ఈద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ సమాజంలో ఆశ, సామరస్యం, దయ, స్ఫూర్తిని పెంపొందించాలన ఆకాంక్షించారు. అన్ని ప్రయత్నాల్లో ఆనందం, విజయం కలగాలని ఎక్స్ ట్విట్టర్లో పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ముస్లింలు ఈద్ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. మసీదుల్లో సందడి వాతావరణం నెలకొంది. ఒకరినొకరు ఒకరు ఆలింగనం చేసుకుంటూ శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు. పవిత్ర రంజాన్ మాసం ముగిసిన సందర్భంగా ఈద్-ఉల్-ఫితర్ జరుపుకుంటారు. ఇది ముస్లింలకు ప్రత్యేకమైన రోజు. ఆదివారం దేశంలో ఈద్ చంద్రుడు కనిపించాడు.దీంతో సోమవారం ఈద్ ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్బాన్ని పురస్కరించుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- గల్ఫ్ పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..







