ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాక్టెయిల్ Dh156,000కి సేల్..!!
- April 15, 2025
దుబాయ్: ‘సెలబ్రిటీ’ బార్టెండర్ అందించే కస్టమ్-మేడ్ పదార్థాలతో రూపొందించబడిన, ప్రత్యేకమైన క్రిస్టల్ గ్లాసుల్లో దుబాయ్లో తయారు చేసిన కాక్టెయిల్ ఇప్పటివరకు అమ్ముడైన అత్యంత ఖరీదైనదిగా ప్రపంచ రికార్డును నెలకొల్పింది. €37,500 - సుమారు Dh156,000 - కు ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ నహతేలో అమ్ముడైన ఈ కాక్టెయిల్ను దుబాయ్కు చెందిన మోడల్, వ్యవస్థాపకురాలు డయానా అహద్పూర్ బిడ్డింగ్ యుద్ధంలో గెలిచి కొనుగోలు చేసి రికార్డు సృష్టించారు.
అత్యంత విలాసవంతమైన కాక్టెయిల్ను సృష్టించడమే ఆలోచన అని నహతేలో డ్రింగక్, మార్కెటింగ్ డైరెక్టర్ ఆండ్రీ బోల్షాకోవ్ వివరించారు. కాక్టెయిల్ ప్రారంభ ధరను Dh60,000గా నిర్ణయించారు. కానీ బిడ్డింగ్ లో ఆ డ్రింక్ కు డిమాండ్ పెరగడంతో చివరికి Dh150,000 కంటే ఎక్కువకు అమ్ముడైంది.
కాగా, ఈ ఖరీదైన కాక్టెయిల్ నిజంగా ప్రత్యేకమైనది. ఈ పానీయం 1937లో తయారు చేయబడిన ప్రత్యేక బక్కరట్ గాజుసామానులో సర్వ్ చేశారు. దీనిని ఇప్పటివరకు మ్యూజియంలో ఉంచారు. ప్రత్యేకమైన క్రిస్టల్ నుండి తయారు చేసిన వాటిని పారిస్ నుండి దుబాయ్కు తీసుకువచ్చారు. కాక్టెయిల్ కొనుగోలుదారునికి ఈ ప్రత్యేక గ్లాసులను స్మారక చిహ్నంగా అందజేశారు. ఈ రెస్టారెంట్ భాగస్వామి పాట్రన్ టెకీలా ఈ ఈవెంట్ కోసం ప్రత్యేకంగా ఒక ప్రత్యేక ఎడిషన్ బ్లెండ్ను రూపొందించారు. “మాస్టర్ డిస్టిలర్ ఈ బ్లెండ్ను కేవలం 500ml మాత్రమే సృష్టించింది. దీనిని ఈవెంట్కు ఒక వారం ముందు మెక్సికో నుండి తమ సిబ్బంది తీసుకువచ్చారని ఆయన వివరించారు. “మేము (ప్రత్యేక పండ్ల వైన్) కినా లిల్లెట్ను కూడా ఉపయోగించాము. దీనిని జేమ్స్ బాండ్ 007 కోసం రూపొందించిన కాక్టెయిల్ అసలు రెసిపీలో ఉపయోగించారు. వారు ఇకపై అసలు వెర్షన్ను ఉత్పత్తి చేయరు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని సీసాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. మాకు లభించిన బాటిల్ 1950ల నాటిది.” అని పేర్కొన్నారు. 1930ల నాటి అంగోస్టూరా బిట్టర్స్ అనే ప్రత్యేక డ్రింక్ ను “సూపర్ ఎక్స్క్లూజివ్” సర్వ్ కోసం ఎంపిక చేసినట్లు తెలిపారు. అయితే, ఈ డ్రింక్ ను ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ బార్టెండర్లలో ఒకరైన సాల్వటోర్ “ది మాస్ట్రో” కాలాబ్రేస్ కలిపారు.
గత అక్టోబర్లో DIFC ఎమిరేట్స్ ఫైనాన్షియల్ టవర్స్లో ప్రారంభమైన బోహో కేఫ్, గతంలో దాని Dh5,000 బంగారు కరాక్ చాయ్ కోసం వార్తల్లో నిలిచింది. 2024, నవంబర్లో ఒక యూరోపియన్ పర్యాటకుడు ఒక బంగారు కాఫీ, నాలుగు బంగారు క్రోసెంట్లు, రెండు స్కూప్ల బంగారు ఐస్ క్రీం కోసం 6,600 దిర్హామ్ల బిల్లును చెల్లించి వార్తల్లో నిలిచారు.
తాజా వార్తలు
- గల్ఫ్ పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..







