కువైట్‌లో ఇండియన్ స్కూల్ విద్యార్థిని అనుమానస్పద మృతి..!!

- April 16, 2025 , by Maagulf
కువైట్‌లో ఇండియన్ స్కూల్ విద్యార్థిని అనుమానస్పద మృతి..!!

కువైట్: అబ్బాసియాలోని యునైటెడ్ ఇండియన్ స్కూల్‌లో 12వ తరగతి చదువుతున్న శ్రీమతి షారన్ శామ్యూల్ మంగళవారం ఉదయం కువైట్‌లో అనుమానస్పదంగా మరణించింది. అస్వస్థతకు గురికావడంతో ఆమెను ఫర్వానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించింది.

షారన్ కువైట్‌లోని ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న జిగి శామ్యూల్, ఆరోగ్య మంత్రిత్వ శాఖలో ఫిజియోథెరపిస్ట్ అయిన ఆశా దంపతుల కుమార్తె. ఈ కుటుంబం కేరళలోని పతనంతిట్ట జిల్లాకు చెందినది. ఆమె సోదరి  ఆష్లీ శామ్యూల్ ప్రస్తుతం వైద్య డిగ్రీ చదువుతోంది. షారన్ మృతికి పాఠశాల యాజమాన్యం సంతాప తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com