డిజిటల్ యాక్సెసిబిలిటీ గైడ్ ప్రారంభించిన ఒమన్..!!
- April 16, 2025
మస్కట్: నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ “తహావుల్” ప్రాతినిధ్యం వహిస్తున్న రవాణా, కమ్యూనికేషన్లు, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ మంగళవారం డిజిటల్ యాక్సెసిబిలిటీ గైడ్ను ప్రారంభించింది. ఈ చొరవ డిజిటల్ వినియోగాన్ని మెరుగుపరచడంతోపాటు సమాజంలోని అన్ని వర్గాలకు సేవలు అందుబాటులో ఉండేలా చూసుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది.
డిజిటల్ యాక్సెసిబిలిటీ సూత్రాలను అమలు చేయడం ద్వారా వినియోగదారులందరూ తమ అప్లికేషన్లను యాక్సెస్ చేయగలరని, వాటి నుండి ప్రయోజనం పొందేందుకు వీలుగా మొబైల్ అప్లికేషన్, వెబ్సైట్ డెవలపర్లకు సహాయం చేయనున్నారు. డిజిటల్ యాక్సెసిబిలిటీ ప్రమాణాలకు అనుగుణంగా ఉండే అప్లికేషన్లు, వెబ్సైట్లను రూపొందించడానికి సంస్థలను అనుమతించనున్నారు.
ఈ గైడ్ ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలోని మొబైల్ అప్లికేషన్, వెబ్సైట్ అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుంటుంది. ఇందులో ప్రాజెక్ట్ మేనేజర్లు, ఇంటర్ఫేస్ డిజైనర్లు, సాఫ్ట్వేర్ డెవలపర్లు, డిజిటల్ కంటెంట్ రైటర్లు, డిజిటల్ యాక్సెసిబిలిటీ నిపుణులు, క్వాలిటీ ఇంజనీర్లు ఉన్నారు. డెవలపర్లు మొబైల్ అప్లికేషన్లు, వెబ్సైట్లలో డిజిటల్ యాక్సెసిబిలిటీని సాధించడంలో సహాయపడటానికి, వారి యాక్సెసిబిలిటీ స్థాయిలను ఎలా కొలవాలో వివరించడానికి ఈ గైడ్ పలు సూచనలు చేసిందని నిపుణులు తెలిపారు.
తాజా వార్తలు
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్గా బి.సుమతి బాధ్యతల స్వీకరణ
- కార్పొరేట్ ట్యాక్స్ బిల్లులో లోపాలను ఎత్తిచూపిన పార్లమెంట్ ప్యానెల్..!!
- 3 గంటల రెస్క్యూ..మహిళను రక్షించిన యూఏఈ హైకర్..!!
- 2026 Q1లో సౌదీ GDP 2.8% వృద్ధి..!!
- ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై QCAA కఠిన చర్యలు..!!
- ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక..ఒమన్ 7 స్థానాలు మెరుగు..!!
- కువైట్ లో జూన్ 30 వరకు కార్మికుల బదిలీలు..!!
- ఈ ఆదివారం నుంచి జజీరా ఎయిర్వేస్ పూర్తిస్థాయి సేవలు పునఃప్రారంభం
- పర్యావరణ అసమతుల్యంతో ఎండ తీవ్రత
- కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం..ఏపీలో త్వరలో మరో కొత్త పథకం..!









