డిజిటల్ యాక్సెసిబిలిటీ గైడ్ ప్రారంభించిన ఒమన్..!!
- April 16, 2025
మస్కట్: నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ “తహావుల్” ప్రాతినిధ్యం వహిస్తున్న రవాణా, కమ్యూనికేషన్లు, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ మంగళవారం డిజిటల్ యాక్సెసిబిలిటీ గైడ్ను ప్రారంభించింది. ఈ చొరవ డిజిటల్ వినియోగాన్ని మెరుగుపరచడంతోపాటు సమాజంలోని అన్ని వర్గాలకు సేవలు అందుబాటులో ఉండేలా చూసుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది.
డిజిటల్ యాక్సెసిబిలిటీ సూత్రాలను అమలు చేయడం ద్వారా వినియోగదారులందరూ తమ అప్లికేషన్లను యాక్సెస్ చేయగలరని, వాటి నుండి ప్రయోజనం పొందేందుకు వీలుగా మొబైల్ అప్లికేషన్, వెబ్సైట్ డెవలపర్లకు సహాయం చేయనున్నారు. డిజిటల్ యాక్సెసిబిలిటీ ప్రమాణాలకు అనుగుణంగా ఉండే అప్లికేషన్లు, వెబ్సైట్లను రూపొందించడానికి సంస్థలను అనుమతించనున్నారు.
ఈ గైడ్ ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలోని మొబైల్ అప్లికేషన్, వెబ్సైట్ అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుంటుంది. ఇందులో ప్రాజెక్ట్ మేనేజర్లు, ఇంటర్ఫేస్ డిజైనర్లు, సాఫ్ట్వేర్ డెవలపర్లు, డిజిటల్ కంటెంట్ రైటర్లు, డిజిటల్ యాక్సెసిబిలిటీ నిపుణులు, క్వాలిటీ ఇంజనీర్లు ఉన్నారు. డెవలపర్లు మొబైల్ అప్లికేషన్లు, వెబ్సైట్లలో డిజిటల్ యాక్సెసిబిలిటీని సాధించడంలో సహాయపడటానికి, వారి యాక్సెసిబిలిటీ స్థాయిలను ఎలా కొలవాలో వివరించడానికి ఈ గైడ్ పలు సూచనలు చేసిందని నిపుణులు తెలిపారు.
తాజా వార్తలు
- నేటి నుంచి గుణదల మేరీమాత ఉత్సవాలు
- ఖతార్ లో వెయ్యి వస్తువుల ధరలు తగ్గింపు..!!
- మస్కట్ లో INSV కౌండిన్యకు ఘనంగా వీడ్కోలు..!!
- 2025లో సౌదీలో రెమిటెన్స్ రికార్డు..15శాతం వృద్ధి..!!
- ట్రాఫిక్ కు చెక్..అల్ ఖుద్రాలో కొత్త 4-లేన్ల బ్రిడ్జి ప్రారంభం..!!
- సల్మానియా మెడికల్ కాంప్లెక్స్లో అగ్నిప్రమాదం..తప్పిన పెనుప్రమాదం..!!
- ఫహాహీల్ ఎక్స్ ప్రెస్వే ఫాస్ట్ లేన్ 15 రోజుల పాటు మూసివేత..!!
- పోస్టాఫీస్లో అద్భుతమైన స్కీమ్..
- నోబెల్ గ్రహీత నర్గెస్కు మరో ఏడున్నరేళ్ల జైలు
- భారత దేశంలో తొలి సమగ్ర అవయవ మార్పిడి సంస్థ









