డిజిటల్ యాక్సెసిబిలిటీ గైడ్ ప్రారంభించిన ఒమన్..!!
- April 16, 2025
మస్కట్: నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ “తహావుల్” ప్రాతినిధ్యం వహిస్తున్న రవాణా, కమ్యూనికేషన్లు, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ మంగళవారం డిజిటల్ యాక్సెసిబిలిటీ గైడ్ను ప్రారంభించింది. ఈ చొరవ డిజిటల్ వినియోగాన్ని మెరుగుపరచడంతోపాటు సమాజంలోని అన్ని వర్గాలకు సేవలు అందుబాటులో ఉండేలా చూసుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది.
డిజిటల్ యాక్సెసిబిలిటీ సూత్రాలను అమలు చేయడం ద్వారా వినియోగదారులందరూ తమ అప్లికేషన్లను యాక్సెస్ చేయగలరని, వాటి నుండి ప్రయోజనం పొందేందుకు వీలుగా మొబైల్ అప్లికేషన్, వెబ్సైట్ డెవలపర్లకు సహాయం చేయనున్నారు. డిజిటల్ యాక్సెసిబిలిటీ ప్రమాణాలకు అనుగుణంగా ఉండే అప్లికేషన్లు, వెబ్సైట్లను రూపొందించడానికి సంస్థలను అనుమతించనున్నారు.
ఈ గైడ్ ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలోని మొబైల్ అప్లికేషన్, వెబ్సైట్ అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుంటుంది. ఇందులో ప్రాజెక్ట్ మేనేజర్లు, ఇంటర్ఫేస్ డిజైనర్లు, సాఫ్ట్వేర్ డెవలపర్లు, డిజిటల్ కంటెంట్ రైటర్లు, డిజిటల్ యాక్సెసిబిలిటీ నిపుణులు, క్వాలిటీ ఇంజనీర్లు ఉన్నారు. డెవలపర్లు మొబైల్ అప్లికేషన్లు, వెబ్సైట్లలో డిజిటల్ యాక్సెసిబిలిటీని సాధించడంలో సహాయపడటానికి, వారి యాక్సెసిబిలిటీ స్థాయిలను ఎలా కొలవాలో వివరించడానికి ఈ గైడ్ పలు సూచనలు చేసిందని నిపుణులు తెలిపారు.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







