ఖతార్లో ఫేక్ ట్రాఫిక్ జరిమానాల మెసేజుల స్కామ్..!!
- April 16, 2025
దోహా: ఖతార్ మొబైల్ వినియోగదారులకు అధునాతన ఫిషింగ్ SMS స్కామ్ గురించి హెచ్చరికలు జారీ చేశారు. ఇక్కడ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) పంపినట్లుగా ఫేక్ సందేశాలను పంపుతూ..ట్రాఫిక్ జరిమానాలు చెల్లించాలని లింకులను పంపుతున్నట్లు అధికారులు తెలిపారు. “మీ వాహనం చెల్లించని ట్రాఫిక్ జరిమానా (నం. 5965) ఉంది. దయచేసి హుకూమా-మోయి ద్వారా జరిమానా చెల్లించండి. ఈరోజే ” అని ఫేక్ SMSలో పేర్కొంటున్నారు.
యూనిఫైడ్ ప్రభుత్వ వేదిక అయిన హుకూమి (https://hukoomi.gov.qa/) అధికారిక వెబ్సైట్ URL వలె పోలి ఉన్న లింకులను మోసగాళ్లు ఉపయోగిస్తున్నారని తెలిపారు. మోసపూరిత లింక్ ఒరిజినల్ మాదిరిగా కనిపిస్తుంది. కానీ వాస్తవానికి బాధితులను మెట్రాష్ అప్లికేషన్ కు రీ డైరెక్ట్ అవుతుందన్నారు. ఈ నకిలీ సైట్ అనుమానం లేని నివాసితుల నుండి వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని దొంగిలించడానికి రూపొందించారని పేర్కొన్నారు.
మొబైల్ వినియోగదారులు తమ ఇన్స్టాల్ చేయబడిన మెట్రాష్ యాప్ ద్వారా మాత్రమే ట్రాఫిక్ జరిమానాల కోసం తనిఖీ చేయాలని, స్కామ్ల బారిన పడకుండా నిరోధించడానికి ప్రభుత్వ అధికారుల సరైన సోషల్ మీడియా ఛానెల్లతో సంప్రదించాలని కోరారు. ఎవరైనా అధికారిక MoI ఛానెల్లను నేరుగా సంప్రదించి అనుమానాస్పద సందేశాలను వెంటనే నివేదించాలన్నారు.
తాజా వార్తలు
- వాట్సాప్ కొత్త సెక్యూరిటీ ఫీచర్
- APL తొలి మ్యాచ్ కు ముఖ్య అతిథిగా రానున్న రామ్ చరణ్
- ట్రంప్ అధికారాలకు బ్రేక్: ఇరాన్తో యుద్ధాన్ని నిరోధిస్తూ చారిత్రాత్మక తీర్మానం
- చిన్నారి పై హత్యాచారం.. కాలు పై కాల్చి మృగాడిని పట్టుకున్న పోలీసులు
- నార్త్ అల్ బతినాలో 'మ్యాంగో ఎక్స్ట్రావాగంజా' ప్రారంభం..!!
- ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్.. గత సీజన్ రికార్డులు బ్రేక్..!!
- ఫీజులు లేవు.. దుబాయ్లో ఉచిత ఇండోర్ ఫిట్నెస్ ఏరియా గురించి తెలుసా?
- కువైట్ సైన్యం స్పెషల్ ఆపరేషన్..పేలుడు పదార్థాలు నిర్వీర్యం..!!
- సౌదీ అరేబియా పశ్చిమ తీరానికి డస్ట్ అలెర్ట్ జారీ..!!
- ICRF 'థర్స్ట్ క్వెంచర్స్ 2026' క్యాంపెయిన్ ప్రారంభం..!!







