ఖతార్లో ఫేక్ ట్రాఫిక్ జరిమానాల మెసేజుల స్కామ్..!!
- April 16, 2025
దోహా: ఖతార్ మొబైల్ వినియోగదారులకు అధునాతన ఫిషింగ్ SMS స్కామ్ గురించి హెచ్చరికలు జారీ చేశారు. ఇక్కడ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) పంపినట్లుగా ఫేక్ సందేశాలను పంపుతూ..ట్రాఫిక్ జరిమానాలు చెల్లించాలని లింకులను పంపుతున్నట్లు అధికారులు తెలిపారు. “మీ వాహనం చెల్లించని ట్రాఫిక్ జరిమానా (నం. 5965) ఉంది. దయచేసి హుకూమా-మోయి ద్వారా జరిమానా చెల్లించండి. ఈరోజే ” అని ఫేక్ SMSలో పేర్కొంటున్నారు.
యూనిఫైడ్ ప్రభుత్వ వేదిక అయిన హుకూమి (https://hukoomi.gov.qa/) అధికారిక వెబ్సైట్ URL వలె పోలి ఉన్న లింకులను మోసగాళ్లు ఉపయోగిస్తున్నారని తెలిపారు. మోసపూరిత లింక్ ఒరిజినల్ మాదిరిగా కనిపిస్తుంది. కానీ వాస్తవానికి బాధితులను మెట్రాష్ అప్లికేషన్ కు రీ డైరెక్ట్ అవుతుందన్నారు. ఈ నకిలీ సైట్ అనుమానం లేని నివాసితుల నుండి వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని దొంగిలించడానికి రూపొందించారని పేర్కొన్నారు.
మొబైల్ వినియోగదారులు తమ ఇన్స్టాల్ చేయబడిన మెట్రాష్ యాప్ ద్వారా మాత్రమే ట్రాఫిక్ జరిమానాల కోసం తనిఖీ చేయాలని, స్కామ్ల బారిన పడకుండా నిరోధించడానికి ప్రభుత్వ అధికారుల సరైన సోషల్ మీడియా ఛానెల్లతో సంప్రదించాలని కోరారు. ఎవరైనా అధికారిక MoI ఛానెల్లను నేరుగా సంప్రదించి అనుమానాస్పద సందేశాలను వెంటనే నివేదించాలన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







