ఖతార్లో ఫేక్ ట్రాఫిక్ జరిమానాల మెసేజుల స్కామ్..!!
- April 16, 2025
దోహా: ఖతార్ మొబైల్ వినియోగదారులకు అధునాతన ఫిషింగ్ SMS స్కామ్ గురించి హెచ్చరికలు జారీ చేశారు. ఇక్కడ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) పంపినట్లుగా ఫేక్ సందేశాలను పంపుతూ..ట్రాఫిక్ జరిమానాలు చెల్లించాలని లింకులను పంపుతున్నట్లు అధికారులు తెలిపారు. “మీ వాహనం చెల్లించని ట్రాఫిక్ జరిమానా (నం. 5965) ఉంది. దయచేసి హుకూమా-మోయి ద్వారా జరిమానా చెల్లించండి. ఈరోజే ” అని ఫేక్ SMSలో పేర్కొంటున్నారు.
యూనిఫైడ్ ప్రభుత్వ వేదిక అయిన హుకూమి (https://hukoomi.gov.qa/) అధికారిక వెబ్సైట్ URL వలె పోలి ఉన్న లింకులను మోసగాళ్లు ఉపయోగిస్తున్నారని తెలిపారు. మోసపూరిత లింక్ ఒరిజినల్ మాదిరిగా కనిపిస్తుంది. కానీ వాస్తవానికి బాధితులను మెట్రాష్ అప్లికేషన్ కు రీ డైరెక్ట్ అవుతుందన్నారు. ఈ నకిలీ సైట్ అనుమానం లేని నివాసితుల నుండి వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని దొంగిలించడానికి రూపొందించారని పేర్కొన్నారు.
మొబైల్ వినియోగదారులు తమ ఇన్స్టాల్ చేయబడిన మెట్రాష్ యాప్ ద్వారా మాత్రమే ట్రాఫిక్ జరిమానాల కోసం తనిఖీ చేయాలని, స్కామ్ల బారిన పడకుండా నిరోధించడానికి ప్రభుత్వ అధికారుల సరైన సోషల్ మీడియా ఛానెల్లతో సంప్రదించాలని కోరారు. ఎవరైనా అధికారిక MoI ఛానెల్లను నేరుగా సంప్రదించి అనుమానాస్పద సందేశాలను వెంటనే నివేదించాలన్నారు.
తాజా వార్తలు
- మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా..సీఎం రేవంత్ నివాళులు..
- పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి: సోనుసూద్
- ఈ నెల 18న గవర్నర్ను కలవనున్న జగన్
- కూటమి పాలనలో ఎన్నో విజయాలు సాధించాం: మంత్రి పార్థసారధి
- తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయం పై సీఎం రేవంత్ ని అభినందించిన ఎంపీలు
- మంత్రి లోకేష్ అమెరికా పర్యటనలో భారీ పెట్టుబడులకు అవకాశం
- 10 లక్షల ఉద్యోగాలు భారతీయులకు ఇస్తాం: అమెజాన్
- ఉర్దూ అకాడమీ వారోత్సవాలు: మంత్రి ఫరూక్
- 13న హైదరాబాద్ లో లియోనెల్ మెస్సీ సందడి
- గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్







