నేడు విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు
- April 16, 2025
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు యూరప్ పర్యటనకు బయలుదేరుతున్నారు.తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 20న తన పుట్టినరోజు వేడుకలను అక్కడే నిర్వహించనున్నారు.ఈ పర్యటన వ్యక్తిగతమైనదిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.ముఖ్యమంత్రి ఈ రోజు సాయంత్రం విజయవాడ నుంచి ఢిల్లీకి బయలుదేరి, అక్కడి నుంచి విదేశాలకు వెళ్లనున్నట్లు సమాచారం.
కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్ర
ఈ పర్యటనకు సంబంధించి ఏ దేశానికి వెళ్లనున్నారనే విషయాన్ని గోప్యంగా ఉంచారు. వ్యక్తిగత పర్యటన అయినందున చంద్రబాబు ప్రయాణ వివరాలను బయటపెట్టకుండా అధికారికంగా జారీ చేయలేదు. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రకు వెళ్తుండటంతో ఈ పర్యటనకు పెద్దగా అధికార కార్యకలాపాలు లేనట్లు తెలుస్తోంది. చంద్రబాబు గతంలో కూడా తన పుట్టినరోజును కుటుంబంతో కలిసి విదేశాల్లో జరుపుకున్న సందర్భాలు ఉన్నాయి.
ఈ నెల 22న తిరిగి ఢిల్లీకి
విదేశీ పర్యటన అనంతరం చంద్రబాబు ఈ నెల 22న తిరిగి ఢిల్లీకి చేరనున్నారు. అక్కడ ఆయన పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కావచ్చని తెలుస్తోంది. అధికారిక వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి దేశ రాజధానిలో కేంద్రంతో కీలక చర్చలు జరిపే అవకాశముందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వ్యక్తిగత పర్యటన అయినప్పటికీ, ఇది రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







