నేడు విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు
- April 16, 2025
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు యూరప్ పర్యటనకు బయలుదేరుతున్నారు.తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 20న తన పుట్టినరోజు వేడుకలను అక్కడే నిర్వహించనున్నారు.ఈ పర్యటన వ్యక్తిగతమైనదిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.ముఖ్యమంత్రి ఈ రోజు సాయంత్రం విజయవాడ నుంచి ఢిల్లీకి బయలుదేరి, అక్కడి నుంచి విదేశాలకు వెళ్లనున్నట్లు సమాచారం.
కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్ర
ఈ పర్యటనకు సంబంధించి ఏ దేశానికి వెళ్లనున్నారనే విషయాన్ని గోప్యంగా ఉంచారు. వ్యక్తిగత పర్యటన అయినందున చంద్రబాబు ప్రయాణ వివరాలను బయటపెట్టకుండా అధికారికంగా జారీ చేయలేదు. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రకు వెళ్తుండటంతో ఈ పర్యటనకు పెద్దగా అధికార కార్యకలాపాలు లేనట్లు తెలుస్తోంది. చంద్రబాబు గతంలో కూడా తన పుట్టినరోజును కుటుంబంతో కలిసి విదేశాల్లో జరుపుకున్న సందర్భాలు ఉన్నాయి.
ఈ నెల 22న తిరిగి ఢిల్లీకి
విదేశీ పర్యటన అనంతరం చంద్రబాబు ఈ నెల 22న తిరిగి ఢిల్లీకి చేరనున్నారు. అక్కడ ఆయన పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కావచ్చని తెలుస్తోంది. అధికారిక వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి దేశ రాజధానిలో కేంద్రంతో కీలక చర్చలు జరిపే అవకాశముందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వ్యక్తిగత పర్యటన అయినప్పటికీ, ఇది రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









