'ట్రూజెట్' విమాన సేవలను ప్రారంభించిన కేంద్ర మంత్రి
- July 12, 2015
వైమానిక రంగంలోకి అడుగుపెట్టిన టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి తనయుడు, యంగ్ హీరో రామ్ చరణ్ తేజ్ రివ్వున దూసుకుపోతున్నాడు. రామ్ చరణ్ నేతృత్వంలోని 'ట్రూజెట్' పౌర విమానయాన సంస్థ సేవలు ఆదివారం ప్రారంభమయ్యాయి. శంషాబాద్ విమానాశ్రయంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి పి.అశోక్ గజపతిరాజు ముఖ్య అతిథిగా పాల్గొని టర్బో విమాన సేవలను ప్రారంభించారు. హైదరాబాద్ - తిరుపతి మధ్య తొలి విమాన సర్వీసు ప్రారంభమైంది. రామ్ చరణ్ తేజ ట్రూజెట్లో పెట్టుబడులు పెట్టడమే కాకుండా కంపెనీ డెరైక్టర్, బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి టర్బో మేఘా డైరెక్టర్గా ఉన్న రామ్ చరణ్ తేజ్, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు, కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, సంస్థ డైరెక్టర్లు ప్రేమ్ కుమార్, ఉమేశ్ తదితరులు హాజరయ్యారు. కాగా శనివారం సాయంత్రం ట్రూజెట్ విమానానికి రేణిగుంట విమానాశ్రయంలో చిరంజీవి కుటుంబ సభ్యలు పూజలు నిర్వహించారు. అనంతరం అదే విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు.
తాజా వార్తలు
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం







