'ట్రూజెట్' విమాన సేవలను ప్రారంభించిన కేంద్ర మంత్రి
- July 12, 2015
వైమానిక రంగంలోకి అడుగుపెట్టిన టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి తనయుడు, యంగ్ హీరో రామ్ చరణ్ తేజ్ రివ్వున దూసుకుపోతున్నాడు. రామ్ చరణ్ నేతృత్వంలోని 'ట్రూజెట్' పౌర విమానయాన సంస్థ సేవలు ఆదివారం ప్రారంభమయ్యాయి. శంషాబాద్ విమానాశ్రయంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి పి.అశోక్ గజపతిరాజు ముఖ్య అతిథిగా పాల్గొని టర్బో విమాన సేవలను ప్రారంభించారు. హైదరాబాద్ - తిరుపతి మధ్య తొలి విమాన సర్వీసు ప్రారంభమైంది. రామ్ చరణ్ తేజ ట్రూజెట్లో పెట్టుబడులు పెట్టడమే కాకుండా కంపెనీ డెరైక్టర్, బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి టర్బో మేఘా డైరెక్టర్గా ఉన్న రామ్ చరణ్ తేజ్, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు, కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, సంస్థ డైరెక్టర్లు ప్రేమ్ కుమార్, ఉమేశ్ తదితరులు హాజరయ్యారు. కాగా శనివారం సాయంత్రం ట్రూజెట్ విమానానికి రేణిగుంట విమానాశ్రయంలో చిరంజీవి కుటుంబ సభ్యలు పూజలు నిర్వహించారు. అనంతరం అదే విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు.
తాజా వార్తలు
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం









