'ట్రూజెట్' విమాన సేవలను ప్రారంభించిన కేంద్ర మంత్రి
- July 12, 2015
వైమానిక రంగంలోకి అడుగుపెట్టిన టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి తనయుడు, యంగ్ హీరో రామ్ చరణ్ తేజ్ రివ్వున దూసుకుపోతున్నాడు. రామ్ చరణ్ నేతృత్వంలోని 'ట్రూజెట్' పౌర విమానయాన సంస్థ సేవలు ఆదివారం ప్రారంభమయ్యాయి. శంషాబాద్ విమానాశ్రయంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి పి.అశోక్ గజపతిరాజు ముఖ్య అతిథిగా పాల్గొని టర్బో విమాన సేవలను ప్రారంభించారు. హైదరాబాద్ - తిరుపతి మధ్య తొలి విమాన సర్వీసు ప్రారంభమైంది. రామ్ చరణ్ తేజ ట్రూజెట్లో పెట్టుబడులు పెట్టడమే కాకుండా కంపెనీ డెరైక్టర్, బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి టర్బో మేఘా డైరెక్టర్గా ఉన్న రామ్ చరణ్ తేజ్, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు, కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, సంస్థ డైరెక్టర్లు ప్రేమ్ కుమార్, ఉమేశ్ తదితరులు హాజరయ్యారు. కాగా శనివారం సాయంత్రం ట్రూజెట్ విమానానికి రేణిగుంట విమానాశ్రయంలో చిరంజీవి కుటుంబ సభ్యలు పూజలు నిర్వహించారు. అనంతరం అదే విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







