ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్

- July 17, 2026 , by Maagulf
ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్

కువైట్ సిటీ: ఇరాన్ దాడుల నేపథ్యంలో కువైట్ సైన్యానికి చెందిన పలు సైనిక స్థావరాలు, సదుపాయాలపై జరిగిన శత్రు డ్రోన్ దాడుల్లో గాయపడిన భూసేన (కువైట్ ల్యాండ్ ఫోర్సెస్) సిబ్బందిని కువైట్ ఆర్మీ చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఖాలిద్ దరాజ్ సాద్ అల్-షురైయాన్ శుక్రవారం పరామర్శించారు.

ఆయనతో పాటు డిప్యూటీ చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ మేజర్ జనరల్ పైలట్ సబాహ్ జాబెర్ అల్-అహ్మద్ అల్-సబాహ్ కూడా ఈ పర్యటనలో పాల్గొన్నారు.

ఇరాన్ దాడుల ఫలితంగా శుక్రవారం తెల్లవారుజామున కువైట్ సైన్యానికి చెందిన పలు సైనిక శిబిరాలు, కీలక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని శత్రు డ్రోన్లతో దాడులు జరగగా, ఈ ఘటనలో పలువురు సైనికులు గాయపడ్డారు.

గాయపడిన సైనికుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడం, వారికి అందుతున్న వైద్య చికిత్సను సమీక్షించడం కోసం ఈ పరామర్శ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా వైద్య బృందం నుంచి గాయపడిన సైనికుల ఆరోగ్య పరిస్థితిపై ఆర్మీ చీఫ్ సమగ్ర వివరాలు తెలుసుకున్నారు. గాయపడిన వారికి నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్న వైద్య సిబ్బంది సేవలను ఆయన అభినందించారు.

అలాగే గాయపడిన సైనికులు త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి విధుల్లో చేరాలని ఆకాంక్షిస్తూ వారికి ధైర్యం చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com