ఏపీ: శిర్డీ సాయి శతాబ్ది మహాస్తూపం ప్రారంభం
- April 23, 2025
గూడూరు: ఆధ్యాత్మిక గురువు బాబా రామ్ రతన్ జీ సేవలు చిరస్మరణీయమని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు.గూడూరు గ్రామంలోని వరాలసాయి మందిరంలో ఏర్పాటు చేసిన శిర్డీ సాయి శతాబ్ది మహాస్తూపాన్ని సోమవారం వైభవంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా నిర్వహించిన సభలో పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి, మాజీ మంత్రులు మహీధర్ రెడ్డి, కాశిరెడ్డి, తెదేపా రాష్ట్ర నాయకులు కొనకళ్ల జగన్నాథరావు, డీసీ చైర్మన్ పోతన లక్ష్మీనరసింహస్వామి, పారిశ్రామికవేత్త ఉషాబాలకృష్ణన్ తదితరులు ప్రసంగించారు. గూడూరులో వరాలసాయి మందిరంతో పాటు వృద్ధాశ్రమం, కంటి ఆసుపత్రులు నిర్మించి సేవలందించడం ప్రశంసనీయమన్నారు. ఎంతో మంది ఆధ్యాత్మిక మార్గంలో పయనింపజేసేలా కృషి చేసిన మహనీయుడు రామ్ రతన్ జీ అని పేర్కొన్నారు. విశ్వగురు పీఠాధిపతులు విశ్వంజీమహరాజ్ ఆధ్వర్యంలో పలువురు వేద పండితులు పాల్గొని పూజలు చేశారు. ఆలయ నిర్వా హకులు పవన్ కుమార్, ఆధ్యాత్మిక గురువులు, భక్తులు పాల్గొన్నారు.ఈ ట్రస్ట్ బాధ్యతలు మాతాజీ, గుడ్లవల్లేటి పవన్ కుమార్ నిర్వహిస్తున్నారు


తాజా వార్తలు
- కొండగట్టు అంజన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు
- ‘మీ ఇంటికి–మీ డాక్టర్’ ప్రాజెక్టును ప్రారంభించిన గవర్నర్
- IPL నిబంధనల ఉల్లంఘన పై BCCI సీరియస్
- విజయవాడలో ‘బిర్లా న్యూ’ తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- నేరగాళ్ల వేటలో పోలీసులకు సహకరించండి: సూళ్లూరుపేట ఎస్ఐ అజయ్ కుమార్ పిలుపు
- ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం...16 మంది మృతి
- ఏఐసీసీ సమావేశం తర్వాత కేరళ ముఖ్యమంత్రి పై తుది నిర్ణయం
- ఏకగ్రీవ ఓటుతో ముగ్గురు ఎంపీలకు ఉద్వాసన..!!
- అధికారిక మార్గాల ద్వారానే అనుమతులు పొందాలి..!!
- అబుధాబిలో సమావేశమైన ఖతార్, యూఏఈ సుప్రీం కమిటీ..!!









