సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: కొత్త అటెండెన్స్ రూల్స్ ఇవే
- March 17, 2026
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని స్వర్ణ గ్రామ మరియు స్వర్ణ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల జవాబుదారీతనం పెంచేందుకు ప్రభుత్వం హాజరు నిబంధనలను కఠినతరం చేసింది. పారదర్శకమైన పాలన అందించడమే లక్ష్యంగా ‘ఫేసియల్ రికగ్నిషన్’ (Facial Recognition) హాజరు విధానంలో మార్పులు చేస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా హాజరు నిబంధనల ప్రకారం.. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగులు ఇకపై తప్పనిసరిగా ఉదయం 10 గంటల 30 నిమిషాల లోపు ఫేసియల్ రికగ్నిషన్ యాప్ ద్వారా హాజరు నమోదు చేయాల్సి ఉంటుంది. పది నిమిషాల గ్రేస్ టైమ్ అవకాశం కల్పించారు. దీంతో పది గంటల 40 నిమిషాలలోపు హాజరు నమోదు చేయాలి.ఉద్యోగులు 10 గంటల 40 నిమిషాల తర్వాత అటెండెన్స్ నమోదు చేస్తే.. ఆలస్యంగా గుర్తించి సెలవుగా పరిగణిస్తారు.
ఉద్యోగులు ఒకవేళ ఏదైనా అనివార్య కారణాల వలన ఉదయం 10 గంటల 40 నిమిషాల నుంచి 11 గంటల 30 నిమిషాల మధ్య హాజరు నమోదు చేయాల్సి వస్తే.. సచివాలయాల డీడీవో ముందస్తు అనుమతి తీసుకోవాలి. నెలకు కేవలం మూడు సార్లు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. అనుమతి తీసుకోకపోయినా, మూడుసార్లు పూర్తి అయిన ఉద్యోగులు.. ఉదయం 10 గంటల 40 నిమిషాల నుంచి 11 గంటల 30 నిమిషాల మధ్య హాజరు నమోదుచేస్తే.. హాఫ్ డే లీవ్గా పరిగణిస్తారు. అలాగే 11 గంటల 30 నిమిషాల నుంచి 2 గంటల మధ్య హాజరు నమోదు చేస్తే హాఫ్ డే లీవ్గా పరిగణిస్తారు.
తాజా వార్తలు
- 14 లక్షల మంది రైతులకు రూ.75,000 రుణమాఫీ!
- అపోలో హెల్త్టెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్పర్సన్గా శోభన కామినేని
- ఖతార్ లో రెండవ సెమిస్టర్ ఫలితాలు విడుదల..!!
- దుబాయ్ లో క్రికెట్ ఆడుతూ కర్ణాటక వాసి మృతి..ఘనంగా నివాళులు..!!
- షార్జా బ్యాంక్ మిలియనీర్ క్యాంపెయిన్..Dh2 మిలియన్లు గెలిచిన భారత ప్రవాసి..!!
- మక్కాలో పవిత్ర కాబాను కొత్త 'కిస్వా'తో అలంకరణ..!!
- ఆర్థిక ఉపశమన ప్యాకేజీని ప్రకటించిన ఒమన్..!!
- T4 టెర్మినల్ నుంచి ఒకే ఫారీన్ ఫ్లైట్ కు అనుమతి..!!
- తల్లి ఇంటికి నిప్పు పెట్టిన వ్యక్తికి ఐదేళ్ల జైలు శిక్ష..!!
- 22 మంది చిన్నారుల మృతి.. ‘దగ్గు సిరప్’ల పై కేంద్రం కీలక నిర్ణయం..









