సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: కొత్త అటెండెన్స్ రూల్స్ ఇవే
- March 17, 2026
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని స్వర్ణ గ్రామ మరియు స్వర్ణ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల జవాబుదారీతనం పెంచేందుకు ప్రభుత్వం హాజరు నిబంధనలను కఠినతరం చేసింది. పారదర్శకమైన పాలన అందించడమే లక్ష్యంగా ‘ఫేసియల్ రికగ్నిషన్’ (Facial Recognition) హాజరు విధానంలో మార్పులు చేస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా హాజరు నిబంధనల ప్రకారం.. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగులు ఇకపై తప్పనిసరిగా ఉదయం 10 గంటల 30 నిమిషాల లోపు ఫేసియల్ రికగ్నిషన్ యాప్ ద్వారా హాజరు నమోదు చేయాల్సి ఉంటుంది. పది నిమిషాల గ్రేస్ టైమ్ అవకాశం కల్పించారు. దీంతో పది గంటల 40 నిమిషాలలోపు హాజరు నమోదు చేయాలి.ఉద్యోగులు 10 గంటల 40 నిమిషాల తర్వాత అటెండెన్స్ నమోదు చేస్తే.. ఆలస్యంగా గుర్తించి సెలవుగా పరిగణిస్తారు.
ఉద్యోగులు ఒకవేళ ఏదైనా అనివార్య కారణాల వలన ఉదయం 10 గంటల 40 నిమిషాల నుంచి 11 గంటల 30 నిమిషాల మధ్య హాజరు నమోదు చేయాల్సి వస్తే.. సచివాలయాల డీడీవో ముందస్తు అనుమతి తీసుకోవాలి. నెలకు కేవలం మూడు సార్లు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. అనుమతి తీసుకోకపోయినా, మూడుసార్లు పూర్తి అయిన ఉద్యోగులు.. ఉదయం 10 గంటల 40 నిమిషాల నుంచి 11 గంటల 30 నిమిషాల మధ్య హాజరు నమోదుచేస్తే.. హాఫ్ డే లీవ్గా పరిగణిస్తారు. అలాగే 11 గంటల 30 నిమిషాల నుంచి 2 గంటల మధ్య హాజరు నమోదు చేస్తే హాఫ్ డే లీవ్గా పరిగణిస్తారు.
తాజా వార్తలు
- ఖతార్లో ప్రయాణికుల మెడిసిన్స్ కు ఈ-పర్మిట్..!!
- ఆన్లైన్ ట్రావెల్ మోసాలపై ప్రయాణికులకు హెచ్చరిక..!!
- షేక్ ఈసా బ్రిడ్జిపై తాత్కాలికంగా ఒక లేన్ మూసివేత..!!
- బహ్రెయిన్ లో స్మాల్ బోట్స్ కు రిమోట్ టెక్నికల్ తనిఖీలు..!!
- కువైట్లో అక్రమ గర్భస్రావాల కేసు.. డాక్టర్ అరెస్ట్..!!
- జీసీసీ-యూరప్ పార్లమెంటరీ సమావేశం.. ప్రాంతీయ భద్రతపై ఆందోళన..!!
- సౌదీలో ఎండల తీవ్రత.. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు..!!
- యూఏఈలో కొత్త విద్యాసంవత్సరానికి భారీగా పెరిగిన ఖర్చులు..!!
- మూడు వారాల విరామం తర్వాత బహ్రెయిన్, కువైట్కు ఎతిహాద్ విమాన సర్వీసులు పునఃప్రారంభం
- వాహనదారులకు రవాణా శాఖ గుడ్న్యూస్







