నీట మునిగి భారతీయ వలసదారుడి మృతి
- July 08, 2016
థామస్ జాన్ అనే భారతీయ వలసదారుడు, ఖతార్ ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ (క్యుయెకాన్)లో పనిచేస్తున్నాడు. 15 మందితో కలిసి, ఈద్ సెలవుల సందర్భంగా విహార యాత్రకు వెళ్ళిన థామస్ జాన్ ప్రమాదవశాత్తూ నీట మునిగాడు. ఆయనతోపాటు మరో ముగ్గురు కూడా నీట మునిగినా, వారిని ప్రాణాలతో కాపాడగలిగారు సన్నిహితులు. అయితే జాన్ మాత్రం ప్రాణాలు నిలుపుకోలేకపోయాడు. నీటిలోంచి జాన్ని బయటకు తీసిన సన్నిహితులు, అతన్ని అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించినా, అతని ప్రాణాల్ని కాపాడలేకపోయారు. ఈద్ సెలవుల సందర్భంగా బీచ్ పరిసరాలు జనం సందడితో నిండిపోయింది. ఇలాంటి సందర్భాల్లో సరైన అవగాహన లేక, విహార యాత్రల్ని విషాదయాత్రలుగా మార్చుకుంటుంటారు. ఖతార్లో జాన్ 1996 నుంచి నివాసం ఉంటున్నారు. వక్రాలోని హమాద్ మాస్పిటల్ మార్చురీలో జాన్ మృతదేహాన్ని ఉంచారు.
తాజా వార్తలు
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!









