నీట మునిగి భారతీయ వలసదారుడి మృతి
- July 08, 2016
థామస్ జాన్ అనే భారతీయ వలసదారుడు, ఖతార్ ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ (క్యుయెకాన్)లో పనిచేస్తున్నాడు. 15 మందితో కలిసి, ఈద్ సెలవుల సందర్భంగా విహార యాత్రకు వెళ్ళిన థామస్ జాన్ ప్రమాదవశాత్తూ నీట మునిగాడు. ఆయనతోపాటు మరో ముగ్గురు కూడా నీట మునిగినా, వారిని ప్రాణాలతో కాపాడగలిగారు సన్నిహితులు. అయితే జాన్ మాత్రం ప్రాణాలు నిలుపుకోలేకపోయాడు. నీటిలోంచి జాన్ని బయటకు తీసిన సన్నిహితులు, అతన్ని అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించినా, అతని ప్రాణాల్ని కాపాడలేకపోయారు. ఈద్ సెలవుల సందర్భంగా బీచ్ పరిసరాలు జనం సందడితో నిండిపోయింది. ఇలాంటి సందర్భాల్లో సరైన అవగాహన లేక, విహార యాత్రల్ని విషాదయాత్రలుగా మార్చుకుంటుంటారు. ఖతార్లో జాన్ 1996 నుంచి నివాసం ఉంటున్నారు. వక్రాలోని హమాద్ మాస్పిటల్ మార్చురీలో జాన్ మృతదేహాన్ని ఉంచారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







