నీట మునిగి భారతీయ వలసదారుడి మృతి

- July 08, 2016 , by Maagulf
నీట మునిగి భారతీయ వలసదారుడి మృతి
 


థామస్‌ జాన్‌ అనే భారతీయ వలసదారుడు, ఖతార్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీ (క్యుయెకాన్‌)లో పనిచేస్తున్నాడు. 15 మందితో కలిసి, ఈద్‌ సెలవుల సందర్భంగా విహార యాత్రకు వెళ్ళిన థామస్‌ జాన్‌ ప్రమాదవశాత్తూ నీట మునిగాడు. ఆయనతోపాటు మరో ముగ్గురు కూడా నీట మునిగినా, వారిని ప్రాణాలతో కాపాడగలిగారు సన్నిహితులు. అయితే జాన్‌ మాత్రం ప్రాణాలు నిలుపుకోలేకపోయాడు. నీటిలోంచి జాన్‌ని బయటకు తీసిన సన్నిహితులు, అతన్ని అంబులెన్స్‌ ద్వారా ఆసుపత్రికి తరలించినా, అతని ప్రాణాల్ని కాపాడలేకపోయారు. ఈద్‌ సెలవుల సందర్భంగా బీచ్‌ పరిసరాలు జనం సందడితో నిండిపోయింది. ఇలాంటి సందర్భాల్లో సరైన అవగాహన లేక, విహార యాత్రల్ని విషాదయాత్రలుగా మార్చుకుంటుంటారు. ఖతార్‌లో జాన్‌ 1996 నుంచి నివాసం ఉంటున్నారు. వక్రాలోని హమాద్‌ మాస్పిటల్‌ మార్చురీలో జాన్‌ మృతదేహాన్ని ఉంచారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com