ఇంద్రకీలాద్రిలో ఈ మూడు రోజులు ఘాట్రోడ్డు మూసివేత..
- May 03, 2025
విజయవాడ: విజయవాడలోని ఇంద్రకీలాద్రిలో ఈ నెల 6 నుంచి 8 వరకు ఘాట్ రోడ్డును మూసివేస్తున్నారు. మరమ్మతు పనులు చేయనున్న నేపథ్యంలో ఘాట్ రోడ్డును ఆయా తేదీల్లో పూర్తిగా మూసేస్తున్నామని ఆలయ కార్య నిర్వహణ అధికారి కె. రామచంద్ర మోహన్ తెలిపారు.
కనకదుర్గ నగర్ మార్గం నుంచి భక్తులు దేవస్థానానికి చేరుకోవాల్సి ఉటుందని అధికారులు చెప్పారు. హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులు పున్నమి ఘాట్లో తమ వాహనాలు పార్క్ చేసుకోవాలి. అక్కడినుంచి దేవస్థానం ఏర్పాటు చేస్తున్న ఉచిత బస్సు ద్వారా దేవస్థానానికి చేరుకోవచ్చు.
విశాఖపట్నం, చెన్నై తదితర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు సీతమ్మ వారి పాదాల ప్రాంతంలో హోల్డింగ్ ఏరియాలో వాహనాలు పార్కు చేసుకుని దేవస్థానం ఏర్పాటు చేసే ఉచిత బస్సు ద్వారా దేవస్థానానికి చేరుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ మూడు రోజులు ఉచితంగా ప్రయాణం చేసే సదుపాయం కల్పించామని ఈవో తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్లో 19 మంది అరెస్టు..!!
- కువైట్లో DSP లైవ్ షోకు అంతా సిద్ధం..!!
- బహ్రెయిన్ అంబరాన్నంటిన దీపావళి వేడుకలు..!!
- రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఖతార్ దౌత్యవేత్తలు మృతి..!!
- షార్జా పోలీసులు అదుపులో వెహికల్ ఫ్రాడ్ గ్యాంగ్..!!
- కార్నిచ్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి..!!
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!