ఇంద్రకీలాద్రిలో ఈ మూడు రోజులు ఘాట్రోడ్డు మూసివేత..
- May 03, 2025
విజయవాడ: విజయవాడలోని ఇంద్రకీలాద్రిలో ఈ నెల 6 నుంచి 8 వరకు ఘాట్ రోడ్డును మూసివేస్తున్నారు. మరమ్మతు పనులు చేయనున్న నేపథ్యంలో ఘాట్ రోడ్డును ఆయా తేదీల్లో పూర్తిగా మూసేస్తున్నామని ఆలయ కార్య నిర్వహణ అధికారి కె. రామచంద్ర మోహన్ తెలిపారు.
కనకదుర్గ నగర్ మార్గం నుంచి భక్తులు దేవస్థానానికి చేరుకోవాల్సి ఉటుందని అధికారులు చెప్పారు. హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులు పున్నమి ఘాట్లో తమ వాహనాలు పార్క్ చేసుకోవాలి. అక్కడినుంచి దేవస్థానం ఏర్పాటు చేస్తున్న ఉచిత బస్సు ద్వారా దేవస్థానానికి చేరుకోవచ్చు.
విశాఖపట్నం, చెన్నై తదితర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు సీతమ్మ వారి పాదాల ప్రాంతంలో హోల్డింగ్ ఏరియాలో వాహనాలు పార్కు చేసుకుని దేవస్థానం ఏర్పాటు చేసే ఉచిత బస్సు ద్వారా దేవస్థానానికి చేరుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ మూడు రోజులు ఉచితంగా ప్రయాణం చేసే సదుపాయం కల్పించామని ఈవో తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈకి ఫ్లైట్స్ తగ్గిస్తున్న భారత విమానయాన సంస్థలు..!!
- హవల్లీ, సల్మియాలో త్వరలో నీటి సరఫరా పునరుద్ధరణ..!!
- ఒమన్/మిడిల్ ఈస్ట్లో CBSE XII బోర్డు ఎగ్జామ్స్ రద్దు..!!
- ఖతార్ బార్డర్ ద్వారా ప్రయాణంపై ఎంబసీ సూచనలు..!!
- భారీ వర్షాలు.. ఆన్లైన్ పరిహార సర్వీసుకు ఆమోదం..!!
- సౌదీ కస్టమ్స్ పోర్టులలో 663 నిషిద్ధ వస్తువులు సీజ్..!!
- యూఏఈ లాటరీ విజేతలు..9వేల మంది విజేతలు..!!
- అనుమానాస్పద కార్యకలాపాలను నివేదించాలని ఖతార్ పిలుపు..!!
- నువైసీబ్ బార్డర్ క్రాసింగ్ను సందర్శించిన ప్రధానమంత్రి..!!
- సౌదీలో వారంలో 15,339 మంది అరెస్టు..!!









