హవల్లీ, సల్మియాలో త్వరలో నీటి సరఫరా పునరుద్ధరణ..!!
- March 15, 2026
కువైట్: మైదాన్ హవల్లీ ప్రాంతంలో శుక్రవారం ఆకస్మిక సాంకేతిక లోపం తలెత్తింది. దీని కారణంగా దెబ్బతిన్న ప్రధాన మంచినీటి పైప్లైన్ మరమ్మత్తు మరియు ఆపరేషన్ను ప్రత్యేక సాంకేతిక బృందాలు పూర్తి చేశాయి. ఈ మేరకు విద్యుత్, నీరు మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇంజనీర్ ఫాతిమా జవహర్ హయత్ ప్రకటించారు.
మంత్రిత్వ శాఖ ఇప్పటికే నెట్వర్క్లోకి నీటిని తిరిగి పంపింగ్ చేయడం ప్రారంభించిందని మరియు ప్రభావిత ప్రాంతాలకు క్రమంగా మంచినీటి సరఫరాను పునరుద్ధరిస్తోందని హయత్ చెప్పారు. రాబోయే కొన్ని గంటల్లో హవల్లీ మరియు సల్మియాలో నీటి పంపిణీ సాధారణ స్థితికి చేరుకుంటుందని పేర్కొన్నారు. మరమ్మతు పనులను త్వరగా పూర్తి చేయడంలో మంత్రిత్వ శాఖ సాంకేతిక బృందాలు చేసిన కృషిని అభినందించారు.
తాజా వార్తలు
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- IPL 2026: ముంబై పై హైదరాబాద్ ఘన విజయం
- యూరప్ పర్యటనలో యూఏఈలో ప్రధాని మోదీ స్టాప్ఓవర్ చేసే అవకాశం
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- ఇనార్బిట్ మాల్ లో ‘మైఖేల్’ చిత్ర ప్రత్యేక ప్రదర్శన
- 1000 కోట్ల నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం!
- ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..అధికారం ఆ పార్టీలదే...పీపుల్స్ పల్స్ సంచలన ఎగ్జిట్ పోల్స్
- రోడ్డు దాటుతుండగా వాహనం ఢీ..దుబాయ్ పోలీసుల హెచ్చరిక జారీ..!!
- FIFA U-17 ప్రపంచ కప్ ఖతార్ 2026 టోర్నమెంట్ తేదీల ప్రకటన..!!
- 6,640 విద్యుత్ కనెక్షన్ల తొలగింపు..సమీక్షకు ఎంపీ పిలుపు..!!









