కువైట్లో దుమ్ము తుఫాను..ఇండిగోతో సహా మూడు విమానాలు మళ్లింపు..!!
- May 05, 2025
కువైట్: కువైట్లో దుమ్ము తుఫాను కారణంగా ఆదివారం సాయంత్రం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విజిబిలిటీ గణనీయంగా తగ్గింది. దీని ఫలితంగా సౌదీ అరేబియాలోని దమ్మామ్ విమానాశ్రయానికి వచ్చే మూడు విమానాలను దారి మళ్లించారు. అస్థిర వాతావరణ పరిస్థితుల మధ్య ప్రయాణీకులను, విమానాలను రక్షించడానికి అత్యున్నత అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా అన్ని ముందు జాగ్రత్త చర్యలు అమలు చేస్తునట్టు ఎయిర్ నావిగేషన్ విభాగం డైరెక్టర్ దావూద్ అల్-జర్రా తెలిపారు. విజిబిలిటీ 300 మీటర్ల కంటే తక్కువగా పడిపోవడం వల్ల అస్సియుట్, కైరో నుండి వచ్చిన రెండు ఎయిర్ కైరో విమానాలు, ఢిల్లీ నుండి వచ్చిన ఇండిగో విమానాలను దమ్మామ్లోని సమీపంలోని విమానాశ్రయానికి మళ్లించోటు వెల్లడించారు. కాగా, దుమ్ము తుఫాను ఉన్నప్పటికీ షెడ్యూల్ చేయబడిన ఇతర విమానాలు కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేసినట్టు తెలిపారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో ADNOC ట్యాంకర్ పై ఇరాన్ డ్రోన్ దాడి.. తీవ్రంగా ఖండించిన యూఏఈ
- సీబ్ విలాయత్లో 25 సమాధుల వద్ద తవ్వకాలు ప్రారంభం..!!
- అభివృద్ధి, ప్రాంతీయ భద్రత పై జిసిసి, ఈయూ చర్చలు..!!
- దుబాయ్ మాల్ సహా 3 మాల్స్ లో పార్కిన్ ఫీల్డ్ తనిఖీలు..!!
- ప్రపంచంలోనే అత్యంత తక్కువ ఉద్గారాలు.. ఖతార్ ఎయిర్వేస్ మరో ఘనత..!!
- 2027 మోడల్ వాహనాలకు అప్డేటుడ్ ఫ్యూయల్ ఎకానమీ లేబుల్..!!
- మే 27న ఈద్ అల్-అధా..!!
- మానవతా విజయానికి ప్రతీకగా అవయవాల శిబిరం: గవర్నర్ శివప్రతాప్ శుక్లా
- ప్రతాప్ హాస్పిటల్లో గ్రహణమొర్రికి ఉచితంగా శస్త్రచికిత్సలు: డాక్టర్ ప్రతాప్
- విద్యార్థులకు పౌష్టికాహారం: మంత్రి లోకేష్









