కువైట్లో దుమ్ము తుఫాను..ఇండిగోతో సహా మూడు విమానాలు మళ్లింపు..!!
- May 05, 2025
కువైట్: కువైట్లో దుమ్ము తుఫాను కారణంగా ఆదివారం సాయంత్రం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విజిబిలిటీ గణనీయంగా తగ్గింది. దీని ఫలితంగా సౌదీ అరేబియాలోని దమ్మామ్ విమానాశ్రయానికి వచ్చే మూడు విమానాలను దారి మళ్లించారు. అస్థిర వాతావరణ పరిస్థితుల మధ్య ప్రయాణీకులను, విమానాలను రక్షించడానికి అత్యున్నత అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా అన్ని ముందు జాగ్రత్త చర్యలు అమలు చేస్తునట్టు ఎయిర్ నావిగేషన్ విభాగం డైరెక్టర్ దావూద్ అల్-జర్రా తెలిపారు. విజిబిలిటీ 300 మీటర్ల కంటే తక్కువగా పడిపోవడం వల్ల అస్సియుట్, కైరో నుండి వచ్చిన రెండు ఎయిర్ కైరో విమానాలు, ఢిల్లీ నుండి వచ్చిన ఇండిగో విమానాలను దమ్మామ్లోని సమీపంలోని విమానాశ్రయానికి మళ్లించోటు వెల్లడించారు. కాగా, దుమ్ము తుఫాను ఉన్నప్పటికీ షెడ్యూల్ చేయబడిన ఇతర విమానాలు కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేసినట్టు తెలిపారు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!