కువైట్లో దుమ్ము తుఫాను..ఇండిగోతో సహా మూడు విమానాలు మళ్లింపు..!!
- May 05, 2025
కువైట్: కువైట్లో దుమ్ము తుఫాను కారణంగా ఆదివారం సాయంత్రం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విజిబిలిటీ గణనీయంగా తగ్గింది. దీని ఫలితంగా సౌదీ అరేబియాలోని దమ్మామ్ విమానాశ్రయానికి వచ్చే మూడు విమానాలను దారి మళ్లించారు. అస్థిర వాతావరణ పరిస్థితుల మధ్య ప్రయాణీకులను, విమానాలను రక్షించడానికి అత్యున్నత అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా అన్ని ముందు జాగ్రత్త చర్యలు అమలు చేస్తునట్టు ఎయిర్ నావిగేషన్ విభాగం డైరెక్టర్ దావూద్ అల్-జర్రా తెలిపారు. విజిబిలిటీ 300 మీటర్ల కంటే తక్కువగా పడిపోవడం వల్ల అస్సియుట్, కైరో నుండి వచ్చిన రెండు ఎయిర్ కైరో విమానాలు, ఢిల్లీ నుండి వచ్చిన ఇండిగో విమానాలను దమ్మామ్లోని సమీపంలోని విమానాశ్రయానికి మళ్లించోటు వెల్లడించారు. కాగా, దుమ్ము తుఫాను ఉన్నప్పటికీ షెడ్యూల్ చేయబడిన ఇతర విమానాలు కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేసినట్టు తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







