క్రిప్టోకరెన్సీలో ప్రభుత్వ రుసుములు చెల్లింపు.. దుబాయ్ అనుమతి..!!
- May 13, 2025
దుబాయ్: డిజిటల్ మనీ క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ అనుమతినిచ్చింది. డిజిటల్ కరెన్సీ ట్రాన్సాక్షన్ లో దీనిని కీలక అడుగుగా భావిస్తున్నారు. దుబాయ్ ఫైనాన్స్, ప్రపంచ ప్రఖ్యాత క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అయిన క్రిప్టో.కామ్ మధ్య ఒప్పందం కుదిరిన తర్వాత, ప్రభుత్వ సేవల కోసం క్రిప్టో చెల్లింపులను ఉపయోగించడానికి దుబాయ్ సిద్ధమవుతోంది. ఇది ప్రభుత్వం దుబాయ్ డిజిటల్ పోర్టల్లలో కొత్త డిజిటల్ చెల్లింపు ఛానెల్ను అందించడానికి ఆర్థిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడానికి మార్గం సుగమం చేయనుంది.
దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ (DIFC)లో సోమవారం ప్రారంభమైన దుబాయ్ ఫిన్టెక్ సమ్మిట్లో దుబాయ్ ఫైనాన్స్, క్రిప్టో.కామ్ ఈ అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు. దుబాయ్ డిజిటల్ ఆర్థిక రంగాన్ని భవిష్యత్తు వైపు నడిపించడంలో ఈ శిఖరాగ్ర సమావేశం కీలకమైన అడుగుగా పేర్కొంటున్నారు. ఒప్పందాన్ని అమలు చేయడానికి అవసరమైన సాంకేతిక ఏర్పాట్లు పూర్తయిన తర్వాత, వివిధ ప్రభుత్వ సంస్థల కస్టమర్లు, వ్యక్తులు, సంస్థలు.. Crypto.com ప్లాట్ఫారమ్లోని డిజిటల్ వాలెట్లను ఉపయోగించి ప్రభుత్వ సేవా రుసుములను చెల్లించేల ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









