క్రిప్టోకరెన్సీలో ప్రభుత్వ రుసుములు చెల్లింపు.. దుబాయ్ అనుమతి..!!
- May 13, 2025
దుబాయ్: డిజిటల్ మనీ క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ అనుమతినిచ్చింది. డిజిటల్ కరెన్సీ ట్రాన్సాక్షన్ లో దీనిని కీలక అడుగుగా భావిస్తున్నారు. దుబాయ్ ఫైనాన్స్, ప్రపంచ ప్రఖ్యాత క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అయిన క్రిప్టో.కామ్ మధ్య ఒప్పందం కుదిరిన తర్వాత, ప్రభుత్వ సేవల కోసం క్రిప్టో చెల్లింపులను ఉపయోగించడానికి దుబాయ్ సిద్ధమవుతోంది. ఇది ప్రభుత్వం దుబాయ్ డిజిటల్ పోర్టల్లలో కొత్త డిజిటల్ చెల్లింపు ఛానెల్ను అందించడానికి ఆర్థిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడానికి మార్గం సుగమం చేయనుంది.
దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ (DIFC)లో సోమవారం ప్రారంభమైన దుబాయ్ ఫిన్టెక్ సమ్మిట్లో దుబాయ్ ఫైనాన్స్, క్రిప్టో.కామ్ ఈ అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు. దుబాయ్ డిజిటల్ ఆర్థిక రంగాన్ని భవిష్యత్తు వైపు నడిపించడంలో ఈ శిఖరాగ్ర సమావేశం కీలకమైన అడుగుగా పేర్కొంటున్నారు. ఒప్పందాన్ని అమలు చేయడానికి అవసరమైన సాంకేతిక ఏర్పాట్లు పూర్తయిన తర్వాత, వివిధ ప్రభుత్వ సంస్థల కస్టమర్లు, వ్యక్తులు, సంస్థలు.. Crypto.com ప్లాట్ఫారమ్లోని డిజిటల్ వాలెట్లను ఉపయోగించి ప్రభుత్వ సేవా రుసుములను చెల్లించేల ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజా వార్తలు
- లంక పై భారత్ ఘన విజయం..భారత్కు రికార్డు స్థాయిలో ఎనిమిదో మహిళల ఆసియా కప్
- బ్రిక్స్ లో ప్యూర్ వెజ్ డిన్నర్..రాహుల్ కౌంటర్
- యూఏఈ అధ్యక్షుడు, జోర్డాన్ రాజు భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు
- ఏపీ వైద్య రంగానికి కేంద్రం కొత్త భరోసా
- సౌదీ అరేబియాలో భారీ ట్రక్కులకు 6 కీలక నిబంధనలు..!!
- కువైట్లో డ్రోన్లకు కొత్త చట్టం.. నిబంధనలు ఉల్లంఘిస్తే 2 ఏళ్ల జైలు..!!
- స్కూల్లో పిల్లలకు తరచూ తలనొప్పా? కంటి పరీక్షలు తప్పనిసరి: డాక్టర్లు
- ఖతార్లో రిక్రియేషనల్ స్పేసెస్ విస్తరణ వేగవంతం..!!
- ఒమన్లో ఏ వస్తువులు, సేవలకు పన్ను ఉండదో తెలుసా?
- బహ్రెయిన్ రాయబారి–యూఎన్ ఉన్నతాధికారుల భేటీ..!!







