UPSC చైర్మెన్గా అజయ్ కుమార్ నియామకం
- May 14, 2025
న్యూ ఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మెన్గా రక్షణ శాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్ ను నియమించారు. కేంద్ర వ్యక్తిగత వ్యవహారాల శాఖ తన ఆదేశాల్లో ఈ విషయాన్ని తెలిపింది. ఏప్రిల్ 29వ తేదీన ప్రీతి సుదన్ పదవీకాలం ముగిసిన నేపథ్యంలో ఆ పోస్టు అప్పటి నుంచి ఖాళీగా ఉన్నది. అజయ్ కుమార్ను యూపీఎస్సీ చైర్మెన్గా నియమిస్తూ ఇచ్చిన ఆదేశాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము క్లియర్ చేశారు. 1985 నాటి ఐఏఎస్ బ్యాచ్కు చెందిన ఆయనది కేరళ క్యాడర్. ఆగస్టు 23, 2019 నుంచి అక్టోబర్ 31, 2022 వరకు రక్షణశాఖ కార్యదర్శిగా ఆయన చేశారు. ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్తో పాటు ఇతర పరీక్షలను యూపీఎస్సీ నిర్వహించే విషయం తెలిసిందే. యూపీఎస్సీకి ఓ చైర్మెన్ ఉంటారు. దాంట్లో 10 మంది సభ్యులు ఉంటారు. ప్రస్తుతం యూపీఎస్సీలో ఇద్దరు సభ్యులకు ఖాళీలు కూడా ఉన్నాయి. యూపీఎస్సీ చైర్మెన్ను ఆరేళ్ల కోసం అపాయింట్ చేస్తారు. ఆ వ్యక్తి వయసు 65 ఏళ్లు దాటకుండా ఉండాలి.
తాజా వార్తలు
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!
- షిర్డీని తాకని 'గ్యాస్ సెగలు'.. సోలార్ మాహాత్మ్యం
- సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: కొత్త అటెండెన్స్ రూల్స్ ఇవే
- ఐపీఎల్ జట్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026 SRH సీజన్ స్క్వాడ్
- రైతు ఉత్పత్తిదారుల సంస్థల పనితీరు గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!









