ఎమిరాటీయేతరులకు యూఏఈ మాండలికం నిషేధం.. కొత్త మీడియా విధానం..!!
- May 14, 2025
యూఏఈ: యూఏఈ పౌరులు మాత్రమే మీడియా ఛానెళ్లలో ఎమిరాటీ మాండలికంలో మాట్లాడటానికి అనుమతించే కొత్త విధానం గురించిన నిర్ణయం వెనుక గల కారణాన్ని ఓ యూఏఈ ఉన్నతాధికారి ఒకరు వివరించారు, “ఎమిరాటీ పౌరుడు జాతీయ మాండలికం, దుస్తులు క్క నిజమైన విలువను బాగా అర్థం చేసుకోగలడు. ఎందుకంటే అవి జాతీయ గుర్తింపుకు చిహ్నం. దేశ సాంస్కృతిక, చారిత్రక వారసత్వం స్వరూపం” అని పేర్కొన్నారు. బుధవారం జరిగిన ఫెడరల్ నేషనల్ కౌన్సిల్ (FNC) సమావేశంలో ఈ విధానంపై చర్చించారు.
నేషనల్ మీడియా ఆఫీస్ చైర్మన్ అబ్దుల్లా బిన్ మొహమ్మద్ బిన్ బుట్టి అల్ హమీద్, X ద్వారా చేసిన ఒక ప్రకటనలో.. ఈ నియంత్రణ ప్రాముఖ్యతను తెలిపారు. “ఎమిరాటీ మాండలికం, సాంస్కృతిక చిహ్నాలను, ముఖ్యంగా ప్రకటనలలో తప్పుగా సూచించే సందర్భాలు పెరుగుతున్నందుకు ప్రతిస్పందనగా ఈ విధానం అమలు చేయబడింది.” అని తెలారు. అల్ హమీద్ ఎమిరాటీ మాండలికాన్ని సంరక్షించడం ప్రాముఖ్యతను పునరుద్ఘాటించారు.
తాజా వార్తలు
- ఇరాన్ దాడుల అనంతరం కతార్లో ఇండియన్ ఎంబసీ హెచ్చరిక
- ఎయిర్ ఇండియా మిడిల్ ఈస్ట్ విమానాలను నిలిపివేత
- నివాసితులను అప్రమత్తంగా ఉండాలని కోరిన దుబాయ్ సెక్యూరిటీ సర్వీస్
- కతార్ పై మిసైల్ దాడిని తీవ్రంగా ఖండించిన GCC ప్రధాన కార్యదర్శి
- బహ్రెయిన్ వైమానిక పరిధిని తాత్కాలికంగా నిలిపివేత
- కువైట్ తాత్కాలికంగా వైమానిక పరిధి మూసివేత
- శ్రీవారి లడ్డూ ప్రసాదం కొనుగోలుకు నూతన సదుపాయం
- ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు: ఎండీ వీసీ సజ్జనర్
- భారత్కి క్రూడాయిల్ విషయంలో ఇబ్బంది లేదు: హర్దీప్ సింగ్
- చెన్నై పోలీసుల అదుపులో హీరో శ్రీరామ్..