ఎమిరాటీయేతరులకు యూఏఈ మాండలికం నిషేధం.. కొత్త మీడియా విధానం..!!
- May 14, 2025
యూఏఈ: యూఏఈ పౌరులు మాత్రమే మీడియా ఛానెళ్లలో ఎమిరాటీ మాండలికంలో మాట్లాడటానికి అనుమతించే కొత్త విధానం గురించిన నిర్ణయం వెనుక గల కారణాన్ని ఓ యూఏఈ ఉన్నతాధికారి ఒకరు వివరించారు, “ఎమిరాటీ పౌరుడు జాతీయ మాండలికం, దుస్తులు క్క నిజమైన విలువను బాగా అర్థం చేసుకోగలడు. ఎందుకంటే అవి జాతీయ గుర్తింపుకు చిహ్నం. దేశ సాంస్కృతిక, చారిత్రక వారసత్వం స్వరూపం” అని పేర్కొన్నారు. బుధవారం జరిగిన ఫెడరల్ నేషనల్ కౌన్సిల్ (FNC) సమావేశంలో ఈ విధానంపై చర్చించారు.
నేషనల్ మీడియా ఆఫీస్ చైర్మన్ అబ్దుల్లా బిన్ మొహమ్మద్ బిన్ బుట్టి అల్ హమీద్, X ద్వారా చేసిన ఒక ప్రకటనలో.. ఈ నియంత్రణ ప్రాముఖ్యతను తెలిపారు. “ఎమిరాటీ మాండలికం, సాంస్కృతిక చిహ్నాలను, ముఖ్యంగా ప్రకటనలలో తప్పుగా సూచించే సందర్భాలు పెరుగుతున్నందుకు ప్రతిస్పందనగా ఈ విధానం అమలు చేయబడింది.” అని తెలారు. అల్ హమీద్ ఎమిరాటీ మాండలికాన్ని సంరక్షించడం ప్రాముఖ్యతను పునరుద్ఘాటించారు.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







