ఎమిరాటీయేతరులకు యూఏఈ మాండలికం నిషేధం.. కొత్త మీడియా విధానం..!!
- May 14, 2025
యూఏఈ: యూఏఈ పౌరులు మాత్రమే మీడియా ఛానెళ్లలో ఎమిరాటీ మాండలికంలో మాట్లాడటానికి అనుమతించే కొత్త విధానం గురించిన నిర్ణయం వెనుక గల కారణాన్ని ఓ యూఏఈ ఉన్నతాధికారి ఒకరు వివరించారు, “ఎమిరాటీ పౌరుడు జాతీయ మాండలికం, దుస్తులు క్క నిజమైన విలువను బాగా అర్థం చేసుకోగలడు. ఎందుకంటే అవి జాతీయ గుర్తింపుకు చిహ్నం. దేశ సాంస్కృతిక, చారిత్రక వారసత్వం స్వరూపం” అని పేర్కొన్నారు. బుధవారం జరిగిన ఫెడరల్ నేషనల్ కౌన్సిల్ (FNC) సమావేశంలో ఈ విధానంపై చర్చించారు.
నేషనల్ మీడియా ఆఫీస్ చైర్మన్ అబ్దుల్లా బిన్ మొహమ్మద్ బిన్ బుట్టి అల్ హమీద్, X ద్వారా చేసిన ఒక ప్రకటనలో.. ఈ నియంత్రణ ప్రాముఖ్యతను తెలిపారు. “ఎమిరాటీ మాండలికం, సాంస్కృతిక చిహ్నాలను, ముఖ్యంగా ప్రకటనలలో తప్పుగా సూచించే సందర్భాలు పెరుగుతున్నందుకు ప్రతిస్పందనగా ఈ విధానం అమలు చేయబడింది.” అని తెలారు. అల్ హమీద్ ఎమిరాటీ మాండలికాన్ని సంరక్షించడం ప్రాముఖ్యతను పునరుద్ఘాటించారు.
తాజా వార్తలు
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- IPL 2026: ముంబై పై హైదరాబాద్ ఘన విజయం
- యూరప్ పర్యటనలో యూఏఈలో ప్రధాని మోదీ స్టాప్ఓవర్ చేసే అవకాశం
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- ఇనార్బిట్ మాల్ లో ‘మైఖేల్’ చిత్ర ప్రత్యేక ప్రదర్శన
- 1000 కోట్ల నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం!
- ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..అధికారం ఆ పార్టీలదే...పీపుల్స్ పల్స్ సంచలన ఎగ్జిట్ పోల్స్
- రోడ్డు దాటుతుండగా వాహనం ఢీ..దుబాయ్ పోలీసుల హెచ్చరిక జారీ..!!
- FIFA U-17 ప్రపంచ కప్ ఖతార్ 2026 టోర్నమెంట్ తేదీల ప్రకటన..!!
- 6,640 విద్యుత్ కనెక్షన్ల తొలగింపు..సమీక్షకు ఎంపీ పిలుపు..!!









