శ్రీనగర్ నుంచి విమాన సర్వీస్ లు పునరుద్దరణ: కేంద్ర మంత్రి రామ్మోహన్
- May 15, 2025
శ్రీనగర్: నేటి నుంచి శ్రీనగర్ విమానాశ్రయం నుంచి విమాన సర్వీస్ లు పునురుద్దరించినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.. నేడు ఆయన జమ్ము, శ్రీనగర్ లో పర్యటించారు.. విమానాశ్రయాలలను ఆయన పరిశీలించారు.. అక్కడ విమానయాన సర్వీస్ లపై ఆరా తీశారు.. అలాగే శ్రీనగర్, జమ్ము ఎయిర్పోర్టుల్లో భద్రతపై ఎయిర్ పోర్ట్ అధికారులతో సమీక్ష నిర్వహించారు..
ఆపరేషన్ సింధూర్ తరువాత పరిణామాలపై అధికారులను అడిగి వివరాలను తెలుసుకున్నారు.. కాగా యుద్ధ సమయంలో ధైర్యంగా వ్యవరించిన శ్రీనగర్ ఎయిర్పోర్ట్ సిబ్బందిని కేంద్రమంత్రి ఈ సందర్భంగా అభినందించారు. ఇక ఆపరేషన్ సింధూర్ సమయంలో ఆర్మీకి ఎయిర్పోర్ట్ సిబ్బంది పూర్తిగా సహకరించారని వెల్లడించారు.. ఇక నేటి నుంచి శ్రీనగర్ నుంచి విమాన రాకపోకలను పునరుద్దరిస్తునట్లు చెప్పారు. ప్రయాణీకులను సురక్షింతంగా వారి వారి గమ్య స్థానాలకు చేర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.. అలాగే ప్రయాణీకుల భద్రత విషయంలో విమానయాన సిబ్బంది చేస్తున్న సేవలు వెలకట్టలేనివని అన్నారు..
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







