శ్రీనగర్ నుంచి విమాన సర్వీస్ లు పునరుద్దరణ: కేంద్ర మంత్రి రామ్మోహన్
- May 15, 2025
శ్రీనగర్: నేటి నుంచి శ్రీనగర్ విమానాశ్రయం నుంచి విమాన సర్వీస్ లు పునురుద్దరించినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.. నేడు ఆయన జమ్ము, శ్రీనగర్ లో పర్యటించారు.. విమానాశ్రయాలలను ఆయన పరిశీలించారు.. అక్కడ విమానయాన సర్వీస్ లపై ఆరా తీశారు.. అలాగే శ్రీనగర్, జమ్ము ఎయిర్పోర్టుల్లో భద్రతపై ఎయిర్ పోర్ట్ అధికారులతో సమీక్ష నిర్వహించారు..
ఆపరేషన్ సింధూర్ తరువాత పరిణామాలపై అధికారులను అడిగి వివరాలను తెలుసుకున్నారు.. కాగా యుద్ధ సమయంలో ధైర్యంగా వ్యవరించిన శ్రీనగర్ ఎయిర్పోర్ట్ సిబ్బందిని కేంద్రమంత్రి ఈ సందర్భంగా అభినందించారు. ఇక ఆపరేషన్ సింధూర్ సమయంలో ఆర్మీకి ఎయిర్పోర్ట్ సిబ్బంది పూర్తిగా సహకరించారని వెల్లడించారు.. ఇక నేటి నుంచి శ్రీనగర్ నుంచి విమాన రాకపోకలను పునరుద్దరిస్తునట్లు చెప్పారు. ప్రయాణీకులను సురక్షింతంగా వారి వారి గమ్య స్థానాలకు చేర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.. అలాగే ప్రయాణీకుల భద్రత విషయంలో విమానయాన సిబ్బంది చేస్తున్న సేవలు వెలకట్టలేనివని అన్నారు..
తాజా వార్తలు
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!
- షిర్డీని తాకని 'గ్యాస్ సెగలు'.. సోలార్ మాహాత్మ్యం
- సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: కొత్త అటెండెన్స్ రూల్స్ ఇవే
- ఐపీఎల్ జట్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026 SRH సీజన్ స్క్వాడ్
- రైతు ఉత్పత్తిదారుల సంస్థల పనితీరు గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!









