ఇద్దరు ISIS ఉగ్రవాదులు అరెస్టు
- May 17, 2025
ముంబై: ముంబై విమానాశ్రయంలో ఉగ్రవాద సంస్థ ఐసీస్ స్లీపర్ సెల్లో భాగమైన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) అధికారులు శనివారం తెలిపారు. 2023లో మహారాష్ట్రలోని పూణేలో ఐఈడీల తయారీ, పరీక్షలకు సంబంధించిన కేసులో వీరిద్దరూ వాంటెడ్గా ఉన్న అబ్దుల్లా ఫయాజ్ షేక్ అలియాస్ ‘డైపర్వాలా’, తల్హా ఖాన్లను అరెస్టు చేసినట్లు తెలిపారు.
వీరు ఇండోనేషియాలోని జకార్తా నుండి భారత్కు తిరిగి వచ్చారని..గత రాత్రి ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 2 వద్ద ఇమ్మిగ్రేషన్ అధికారులు వారిని అరెస్టు చేసినట్లు తెలిపారు.అనంతరం ఎన్ఐఏ బృందం వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఇద్దరు నిందితులు రెండేళ్లకు పైగా పరారీలో ఉన్నారని..వారి పై ముంబైలోని ఎన్ఐఎ ప్రత్యేక కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్లు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఇరాన్ దాడుల అనంతరం కతార్లో ఇండియన్ ఎంబసీ హెచ్చరిక
- ఎయిర్ ఇండియా మిడిల్ ఈస్ట్ విమానాలను నిలిపివేత
- నివాసితులను అప్రమత్తంగా ఉండాలని కోరిన దుబాయ్ సెక్యూరిటీ సర్వీస్
- కతార్ పై మిసైల్ దాడిని తీవ్రంగా ఖండించిన GCC ప్రధాన కార్యదర్శి
- బహ్రెయిన్ వైమానిక పరిధిని తాత్కాలికంగా నిలిపివేత
- కువైట్ తాత్కాలికంగా వైమానిక పరిధి మూసివేత
- శ్రీవారి లడ్డూ ప్రసాదం కొనుగోలుకు నూతన సదుపాయం
- ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు: ఎండీ వీసీ సజ్జనర్
- భారత్కి క్రూడాయిల్ విషయంలో ఇబ్బంది లేదు: హర్దీప్ సింగ్
- చెన్నై పోలీసుల అదుపులో హీరో శ్రీరామ్..