ఇద్దరు ISIS ఉగ్రవాదులు అరెస్టు
- May 17, 2025
ముంబై: ముంబై విమానాశ్రయంలో ఉగ్రవాద సంస్థ ఐసీస్ స్లీపర్ సెల్లో భాగమైన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) అధికారులు శనివారం తెలిపారు. 2023లో మహారాష్ట్రలోని పూణేలో ఐఈడీల తయారీ, పరీక్షలకు సంబంధించిన కేసులో వీరిద్దరూ వాంటెడ్గా ఉన్న అబ్దుల్లా ఫయాజ్ షేక్ అలియాస్ ‘డైపర్వాలా’, తల్హా ఖాన్లను అరెస్టు చేసినట్లు తెలిపారు.
వీరు ఇండోనేషియాలోని జకార్తా నుండి భారత్కు తిరిగి వచ్చారని..గత రాత్రి ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 2 వద్ద ఇమ్మిగ్రేషన్ అధికారులు వారిని అరెస్టు చేసినట్లు తెలిపారు.అనంతరం ఎన్ఐఏ బృందం వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఇద్దరు నిందితులు రెండేళ్లకు పైగా పరారీలో ఉన్నారని..వారి పై ముంబైలోని ఎన్ఐఎ ప్రత్యేక కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్లు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- భారత్ కో జానియే క్విజ్కు ముగియనున్న గడువు..!!
- సౌదీలో ఐబెక్స్ను వేటాడిన వ్యక్తి అరెస్ట్..!!
- బహ్రెయిన్ లో రెండు రోజుల్లోనే మ్యారేజ్ సర్టిఫికెట్..!!
- సలాలాలో ఒమన్ ట్రెడిషనల్ గేమ్స్ సీజన్ 2026 ప్రారంభం..!!
- భోగాపురం నుంచి తొలిరోజు 31 విమాన సర్వీసులు
- కొలంబియా భూకంప బాధితులకు యూఏఈ భారీ సాయం..!!
- ఖతార్లో వినియోగదారుల భద్రతకు పెద్దపీట..!!
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం







