హైదరాబాద్ మెట్రో టికెట్ రేట్లు తగ్గాయ్..
- May 23, 2025
హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైల్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల పెంచిన ఛార్జీల్లో 10శాతం తగ్గిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. సవరించిన ఛార్జీలను ఎల్ అండ్ టీ మెట్రో తాజాగా ప్రకటించింది. ఈనెల 24వ తేదీ నుంచి సవరించిన ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. అయితే, పూర్తిగా 10శాతం తగ్గిస్తున్నట్లు చెప్పినప్పటికీ.. ఒక్కొక్క స్లాబ్ లో ఒక విధంగా తగ్గిస్తూ మెట్రో అధికారులు నిర్ణయించారు.
కొత్త ఛార్జీలు ఇలా..
- రెండు కిలోమీటర్ల వరకు రూ.12 ఉండగా.. రూ. 11 గా నిర్ణయించారు.
- నాలుగు కిలోమీటర్ల వరకు రూ.18 ఉండగా.. రూ.17 గా నిర్ణయించారు.
- ఆరు కిలోమీటర్ల వరకు రూ.30 ఉండగా.. రూ.28 గా నిర్ణయించారు.
- తొమ్మిది కిలో మీటర్ల వరకు రూ.40 ఉండగా.. రూ. 37గా నిర్ణయించారు.
- 12 కిలోమీటర్ల వరకు రూ.50 ఉండగా.. రూ. 47 గా నిర్ణయించారు.
- 15 కిలోమీటర్ల వరకు రూ.55 ఉండగా.. రూ.51 గా నిర్ణయించారు.
- 18 కిలోమీటర్ల వరకు రూ.60 ఉండగా.. రూ. 56గా నిర్ణయించారు.
- 21 కిలోమీటర్ల వరకు ప్రస్తుత ఛార్జీ రూ. 66 కాగా.. రూ.61 గా నిర్ణయించారు.
- 24 కిలోమీటర్ల వరకు రూ.70 ఉండగా.. రూ.65 గా నిర్ణయించారు.
- 24 కిలోమీటర్ల తర్వాత ప్రయాణం చేసే వారికి టికెట్ ధర రూ.75 ఉండగా.. రూ.6 తగ్గించి రూ.69 గా నిర్ణయించారు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!