హైదరాబాద్ మెట్రో టికెట్ రేట్లు తగ్గాయ్..
- May 23, 2025
హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైల్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల పెంచిన ఛార్జీల్లో 10శాతం తగ్గిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. సవరించిన ఛార్జీలను ఎల్ అండ్ టీ మెట్రో తాజాగా ప్రకటించింది. ఈనెల 24వ తేదీ నుంచి సవరించిన ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. అయితే, పూర్తిగా 10శాతం తగ్గిస్తున్నట్లు చెప్పినప్పటికీ.. ఒక్కొక్క స్లాబ్ లో ఒక విధంగా తగ్గిస్తూ మెట్రో అధికారులు నిర్ణయించారు.
కొత్త ఛార్జీలు ఇలా..
- రెండు కిలోమీటర్ల వరకు రూ.12 ఉండగా.. రూ. 11 గా నిర్ణయించారు.
- నాలుగు కిలోమీటర్ల వరకు రూ.18 ఉండగా.. రూ.17 గా నిర్ణయించారు.
- ఆరు కిలోమీటర్ల వరకు రూ.30 ఉండగా.. రూ.28 గా నిర్ణయించారు.
- తొమ్మిది కిలో మీటర్ల వరకు రూ.40 ఉండగా.. రూ. 37గా నిర్ణయించారు.
- 12 కిలోమీటర్ల వరకు రూ.50 ఉండగా.. రూ. 47 గా నిర్ణయించారు.
- 15 కిలోమీటర్ల వరకు రూ.55 ఉండగా.. రూ.51 గా నిర్ణయించారు.
- 18 కిలోమీటర్ల వరకు రూ.60 ఉండగా.. రూ. 56గా నిర్ణయించారు.
- 21 కిలోమీటర్ల వరకు ప్రస్తుత ఛార్జీ రూ. 66 కాగా.. రూ.61 గా నిర్ణయించారు.
- 24 కిలోమీటర్ల వరకు రూ.70 ఉండగా.. రూ.65 గా నిర్ణయించారు.
- 24 కిలోమీటర్ల తర్వాత ప్రయాణం చేసే వారికి టికెట్ ధర రూ.75 ఉండగా.. రూ.6 తగ్గించి రూ.69 గా నిర్ణయించారు.
తాజా వార్తలు
- గ్రీన్కార్డ్ హోల్డర్లకు బిగ్షాక్..!
- సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్..సీఐ నాగరాజు అరెస్ట్
- దుబాయ్లో అద్దెదారులకు ఊరట.. ‘ఫ్లెక్సీ రెంట్’ పథకం ప్రారంభం
- సెప్టెంబర్ 30న ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు శ్రీకారం
- డాలస్ లో మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
- ప్రారంభమైన టెలిగ్రామ్ సేవలు
- ఇరాన్ ఆయిల్ పై ఆంక్షలు ఎత్తేసిన అమెరికా
- భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా సమ్మేళనం..!!
- అర్హతలు,వృత్తుల సవరణకు కార్మికులకు కువైట్ అనుమతి..!!
- 2023 తర్వాత ఒమన్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు..!!







