షార్జాలో ప్రభుత్వ రంగానికి 4 రోజులపాటు సెలవులు..!!
- May 29, 2025
యూఏఈ: ఈద్ అల్ అధాకు నాలుగు రోజులపాటు ప్రభుత్వ సెలవులను షార్జా ప్రకటించింది. ఈ సెలవులు జూన్ 5, అరాఫా దినోత్సవం నుండి ప్రారంభమై జూన్ 8 వరకు కొనసాగుతుంది. షిఫ్ట్ ప్రాతిపదికన పనిచేసే ఉద్యోగులకు మినహాయింపు ఇచ్చారు. జూన్ 9 నుండి అధికారిక పనివేళలు తిరిగి ప్రారంభమవుతాయని ప్రకటించారు. షార్జా ప్రభుత్వ విభాగాలు, అధికారులు, సంస్థలలో పనిచేసే వారికి ఈ సెలవులు వర్తిస్తాయని పేర్కొన్నారు.
ఫెడరల్ అథారిటీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ యూఏఈలోని ప్రభుత్వ ఉద్యోగులకు ఈ సంవత్సరం ఈద్ అల్ అధాకు నాలుగు రోజులపాటు సెలవులు ప్రకటించింది. జుల్ హిజ్జా 9 నుండి జుల్ హిజ్జా 12 వరకు దేశం సెలవుదినాన్ని పాటిస్తుందని అథారిటీ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. మే 27 సాయంత్రం జుల్ హిజ్జా నెలవంక కనిపించిన తర్వాత, జూన్ 6 నాడు యూఏఈ ఈద్ అల్ అధాను జరుపుకుంటుంది.
తాజా వార్తలు
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..
- ట్రాఫిక్ విధులకు శిక్షణ పొందిన పోలీసు సిబ్బందితో సైబరాబాద్ సీపీ సమావేశం
- కార్మికుల ఆరోగ్యం, భద్రతకే ప్రాధాన్యత..!!
- దుబాయ్లోని ఈ మేజర్ ఆకర్షణలు సమ్మర్ లో మూసివేత..!!
- కువైట్ లో విమాన రాకపోకలలో గణనీయమైన వృద్ధి..!!
- అమ్మన్లో సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రుల భేటీ..!!
- రైతులకు ఒమన్ ఫ్లోర్ మిల్స్ గుడ్ న్యూస్..!!
- బహ్రెయిన్ లో ఇకపై ఇంగ్లిష్ లోనూ నోటరైజేషన్..!!
- యూఏఈలో ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు బుకింగ్లు ప్రారంభం..
- గ్రీన్కార్డ్ హోల్డర్లకు బిగ్షాక్..!







