సౌదీ అరేబియాలో భారత అఖిల పక్ష ప్రతినిధి బృందం..వివిధ అంశాలపై సమీక్ష..!!
- May 29, 2025
రియాద్: భారత అఖిల పక్ష ప్రతినిధి బృందం సౌదీ అరేబియాలో అడుగుపెట్టింది. సౌదీ విదేశాంగ శాఖ సహాయ మంత్రి, క్యాబినెట్ సభ్యుడు అదెల్ అల్-జుబేర్ వారికి ఘన స్వాగతం పలికారు. భారత పార్లమెంట్ మెంబర్ బైజయంత్ జే పాండా నేతృత్వంలోని భారత పార్లమెంటు సభ్యుల ప్రతినిధి బృందం సౌదీ అరేబియాకు వచ్చింది. సౌదీ అరేబియా - భారతదేశం మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి మార్గాలను అన్వేషించడంతో పాటు, పరస్పర ఆసక్తి ఉన్న అంశాలను ఈ సందర్భంగా సమీక్షించారు.
భారత అఖిల పక్ష ప్రతినిధి బృందం మూడు రోజులపాటు సౌదీ అరేబియాలో పర్యటించనుంది. సరిహద్దు ఉగ్రవాద సమస్యను, ఇటీవల పహల్గాం ఉగ్రదాడి, తదనంతరం ఆపరేషన్ సిందూర్ గురించిన విషయాలన్ని వెల్లడించేందుకు సౌదీ అరేబియా దేశ ప్రతినిధులకు వివరించనున్నారు.
భారత ప్రతినిధి బృందంలో పార్లమెంట్ సభ్యులు నిషికాంత్ దూబే, ఫాంగ్నాన్ కొన్యాక్, రేఖా శర్మ, అసదుద్దీన్ ఒవైసీ, సత్నామ్ సింగ్ సంధు, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్, భారత మాజీ దౌత్యవేత్త హర్షవర్ధన్ ష్రింగ్లా ఉన్నారు.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







