సౌదీ అరేబియాలో భారత అఖిల పక్ష ప్రతినిధి బృందం..వివిధ అంశాలపై సమీక్ష..!!
- May 29, 2025
రియాద్: భారత అఖిల పక్ష ప్రతినిధి బృందం సౌదీ అరేబియాలో అడుగుపెట్టింది. సౌదీ విదేశాంగ శాఖ సహాయ మంత్రి, క్యాబినెట్ సభ్యుడు అదెల్ అల్-జుబేర్ వారికి ఘన స్వాగతం పలికారు. భారత పార్లమెంట్ మెంబర్ బైజయంత్ జే పాండా నేతృత్వంలోని భారత పార్లమెంటు సభ్యుల ప్రతినిధి బృందం సౌదీ అరేబియాకు వచ్చింది. సౌదీ అరేబియా - భారతదేశం మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి మార్గాలను అన్వేషించడంతో పాటు, పరస్పర ఆసక్తి ఉన్న అంశాలను ఈ సందర్భంగా సమీక్షించారు.
భారత అఖిల పక్ష ప్రతినిధి బృందం మూడు రోజులపాటు సౌదీ అరేబియాలో పర్యటించనుంది. సరిహద్దు ఉగ్రవాద సమస్యను, ఇటీవల పహల్గాం ఉగ్రదాడి, తదనంతరం ఆపరేషన్ సిందూర్ గురించిన విషయాలన్ని వెల్లడించేందుకు సౌదీ అరేబియా దేశ ప్రతినిధులకు వివరించనున్నారు.
భారత ప్రతినిధి బృందంలో పార్లమెంట్ సభ్యులు నిషికాంత్ దూబే, ఫాంగ్నాన్ కొన్యాక్, రేఖా శర్మ, అసదుద్దీన్ ఒవైసీ, సత్నామ్ సింగ్ సంధు, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్, భారత మాజీ దౌత్యవేత్త హర్షవర్ధన్ ష్రింగ్లా ఉన్నారు.
తాజా వార్తలు
- రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటు
- తిరుపతి నుండి గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులు నడపాలి: ఎంపీ రఘునాధరెడ్డి
- US ప్రతినిధుల సభలో H-1B వీసాల రద్దు బిల్లు
- మహిళలకు APSRTC శుభవార్త..
- ఆటో రంగంలో భారత్కు బిగ్ బూస్ట్, చైనాకు షాక్
- మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో..సైబరాబాద్ సీపీ దిశానిర్దేశం
- లోక్ భవన్లో గవర్నర్ను కలిసిన అసెంబ్లీ స్పీకర్
- మీడియా సిటీ ఖతార్.. 244 సంస్థలు ఆసక్తి..!!
- 46వ అల్బరాకా ఫోరమ్ ప్రారంభించిన మదీనా అమీర్..!!
- యూఏఈ మొట్టమొదటి రోడ్-రైల్ అంబులెన్స్..!!









