సౌదీ అరేబియాలో భారత అఖిల పక్ష ప్రతినిధి బృందం..వివిధ అంశాలపై సమీక్ష..!!
- May 29, 2025
రియాద్: భారత అఖిల పక్ష ప్రతినిధి బృందం సౌదీ అరేబియాలో అడుగుపెట్టింది. సౌదీ విదేశాంగ శాఖ సహాయ మంత్రి, క్యాబినెట్ సభ్యుడు అదెల్ అల్-జుబేర్ వారికి ఘన స్వాగతం పలికారు. భారత పార్లమెంట్ మెంబర్ బైజయంత్ జే పాండా నేతృత్వంలోని భారత పార్లమెంటు సభ్యుల ప్రతినిధి బృందం సౌదీ అరేబియాకు వచ్చింది. సౌదీ అరేబియా - భారతదేశం మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి మార్గాలను అన్వేషించడంతో పాటు, పరస్పర ఆసక్తి ఉన్న అంశాలను ఈ సందర్భంగా సమీక్షించారు.
భారత అఖిల పక్ష ప్రతినిధి బృందం మూడు రోజులపాటు సౌదీ అరేబియాలో పర్యటించనుంది. సరిహద్దు ఉగ్రవాద సమస్యను, ఇటీవల పహల్గాం ఉగ్రదాడి, తదనంతరం ఆపరేషన్ సిందూర్ గురించిన విషయాలన్ని వెల్లడించేందుకు సౌదీ అరేబియా దేశ ప్రతినిధులకు వివరించనున్నారు.
భారత ప్రతినిధి బృందంలో పార్లమెంట్ సభ్యులు నిషికాంత్ దూబే, ఫాంగ్నాన్ కొన్యాక్, రేఖా శర్మ, అసదుద్దీన్ ఒవైసీ, సత్నామ్ సింగ్ సంధు, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్, భారత మాజీ దౌత్యవేత్త హర్షవర్ధన్ ష్రింగ్లా ఉన్నారు.
తాజా వార్తలు
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..
- ట్రాఫిక్ విధులకు శిక్షణ పొందిన పోలీసు సిబ్బందితో సైబరాబాద్ సీపీ సమావేశం
- కార్మికుల ఆరోగ్యం, భద్రతకే ప్రాధాన్యత..!!
- దుబాయ్లోని ఈ మేజర్ ఆకర్షణలు సమ్మర్ లో మూసివేత..!!
- కువైట్ లో విమాన రాకపోకలలో గణనీయమైన వృద్ధి..!!
- అమ్మన్లో సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రుల భేటీ..!!
- రైతులకు ఒమన్ ఫ్లోర్ మిల్స్ గుడ్ న్యూస్..!!
- బహ్రెయిన్ లో ఇకపై ఇంగ్లిష్ లోనూ నోటరైజేషన్..!!
- యూఏఈలో ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు బుకింగ్లు ప్రారంభం..
- గ్రీన్కార్డ్ హోల్డర్లకు బిగ్షాక్..!







