SVBC అభివృద్ధి పై సమీక్షా సమావేశం
- May 30, 2025
తిరుమల: శ్రీవేంకటేశ్వర భక్తి ఛానెల్లో ప్రసారమౌతున్న కార్యక్రమాల నాణ్యత మరియు అభివృద్ధిపై శుక్రవారం తిరుమలలోని అన్నమయ్య భవన్ లో టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు ఈవో జె.శ్యామలరావు కలసి సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ మాట్లాడుతూ ఎస్వీబీసీలో మరింత నాణ్యమైన కార్యక్రమాలు రూపొందించాలని తెలిపారు.శ్రీవారి భక్తులను ఆకట్టుకునే విధంగా కార్యక్రమాలకు రూప కల్పన చేయాలని తద్వారా వీక్షకుల సంఖ్య పెంచ వచ్చునని తెలిపారు.
ఈవో మాట్లాడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాలను నాణ్యమైన ప్రమాణాలతో రూపొందించడంతో పాటు యువతకు చేరువయ్యేలా కార్యక్రమాలు ప్రసారం చేయాలని తెలియజేశారు.
అంతకు మునుపు సాంకేతిక మరియు కంటెంట్ నిపుణులు శ్రీనివాసరెడ్డి,రవి కుమార్,శ్రీనివాస్ ఎస్వీబీసీ కార్యక్రమాల ప్రమాణాలను మరింత ఆకర్షణీయంగా తీర్చి దిద్దేలా పలు సలహాలు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, జేఈఓ మరియు సీఈఓ ఎస్వీబీసీ ఇంచార్జి వీరబ్రహ్మం, ఎస్వీబీసీ ఓఎస్డీ పద్మావతి తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- నేరగాళ్ల వేటలో పోలీసులకు సహకరించండి: సూళ్లూరుపేట ఎస్ఐ అజయ్ కుమార్ పిలుపు
- ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం...16 మంది మృతి
- ఏఐసీసీ సమావేశం తర్వాత కేరళ ముఖ్యమంత్రి పై తుది నిర్ణయం
- ఏకగ్రీవ ఓటుతో ముగ్గురు ఎంపీలకు ఉద్వాసన..!!
- అధికారిక మార్గాల ద్వారానే అనుమతులు పొందాలి..!!
- అబుధాబిలో సమావేశమైన ఖతార్, యూఏఈ సుప్రీం కమిటీ..!!
- ఫర్వానియాలో ట్రాఫిక్ సమస్యలపై గవర్నర్ సమీక్ష..!!
- షెంజెన్ వీసా రద్దీ: యూరప్ పర్యటనలకు 6 నుండి 8 వారాల నిరీక్షణ..!!
- సాంకేతిక సహకారంపై ఒమన్, ప్రపంచ బ్యాంకు చర్చలు..!!
- సువెందు అధికారి పిఏ హత్య–బెంగాల్లో ఉద్రిక్తత









