SVBC అభివృద్ధి పై సమీక్షా సమావేశం
- May 30, 2025
తిరుమల: శ్రీవేంకటేశ్వర భక్తి ఛానెల్లో ప్రసారమౌతున్న కార్యక్రమాల నాణ్యత మరియు అభివృద్ధిపై శుక్రవారం తిరుమలలోని అన్నమయ్య భవన్ లో టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు ఈవో జె.శ్యామలరావు కలసి సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ మాట్లాడుతూ ఎస్వీబీసీలో మరింత నాణ్యమైన కార్యక్రమాలు రూపొందించాలని తెలిపారు.శ్రీవారి భక్తులను ఆకట్టుకునే విధంగా కార్యక్రమాలకు రూప కల్పన చేయాలని తద్వారా వీక్షకుల సంఖ్య పెంచ వచ్చునని తెలిపారు.
ఈవో మాట్లాడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాలను నాణ్యమైన ప్రమాణాలతో రూపొందించడంతో పాటు యువతకు చేరువయ్యేలా కార్యక్రమాలు ప్రసారం చేయాలని తెలియజేశారు.
అంతకు మునుపు సాంకేతిక మరియు కంటెంట్ నిపుణులు శ్రీనివాసరెడ్డి,రవి కుమార్,శ్రీనివాస్ ఎస్వీబీసీ కార్యక్రమాల ప్రమాణాలను మరింత ఆకర్షణీయంగా తీర్చి దిద్దేలా పలు సలహాలు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, జేఈఓ మరియు సీఈఓ ఎస్వీబీసీ ఇంచార్జి వీరబ్రహ్మం, ఎస్వీబీసీ ఓఎస్డీ పద్మావతి తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- డాలస్ లో మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
- ప్రారంభమైన టెలిగ్రామ్ సేవలు
- ఇరాన్ ఆయిల్ పై ఆంక్షలు ఎత్తేసిన అమెరికా
- భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా సమ్మేళనం..!!
- అర్హతలు,వృత్తుల సవరణకు కార్మికులకు కువైట్ అనుమతి..!!
- 2023 తర్వాత ఒమన్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు..!!
- గౌహతి నుండి దుబాయ్, అబుదాబికి డైరెక్ట్ ఫ్లైట్స్..!!
- పబ్లిక్ పార్కులలో 12 వాణిజ్య కార్యకలాపాలకు సౌదీ అనుమతి..!!
- ఖతార్ లో లుసైల్ ట్రామ్ సేవలు నిలిపివేత..!!
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..







