SVBC అభివృద్ధి పై సమీక్షా సమావేశం
- May 30, 2025
తిరుమల: శ్రీవేంకటేశ్వర భక్తి ఛానెల్లో ప్రసారమౌతున్న కార్యక్రమాల నాణ్యత మరియు అభివృద్ధిపై శుక్రవారం తిరుమలలోని అన్నమయ్య భవన్ లో టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు ఈవో జె.శ్యామలరావు కలసి సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ మాట్లాడుతూ ఎస్వీబీసీలో మరింత నాణ్యమైన కార్యక్రమాలు రూపొందించాలని తెలిపారు.శ్రీవారి భక్తులను ఆకట్టుకునే విధంగా కార్యక్రమాలకు రూప కల్పన చేయాలని తద్వారా వీక్షకుల సంఖ్య పెంచ వచ్చునని తెలిపారు.
ఈవో మాట్లాడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాలను నాణ్యమైన ప్రమాణాలతో రూపొందించడంతో పాటు యువతకు చేరువయ్యేలా కార్యక్రమాలు ప్రసారం చేయాలని తెలియజేశారు.
అంతకు మునుపు సాంకేతిక మరియు కంటెంట్ నిపుణులు శ్రీనివాసరెడ్డి,రవి కుమార్,శ్రీనివాస్ ఎస్వీబీసీ కార్యక్రమాల ప్రమాణాలను మరింత ఆకర్షణీయంగా తీర్చి దిద్దేలా పలు సలహాలు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, జేఈఓ మరియు సీఈఓ ఎస్వీబీసీ ఇంచార్జి వీరబ్రహ్మం, ఎస్వీబీసీ ఓఎస్డీ పద్మావతి తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఆన్లైన్ మోసగాళ్లకు కోర్టు షాక్..
- గ్రీన్ హైడ్రోజన్తో భారత్ శక్తి విప్లవం
- కేటీఆర్, హరీశ్ రావు లతో కేసీఆర్ భేటీ
- లోక్ భవన్లో ఉత్తరప్రదేశ్, దాద్రా నగర్ హవేలీ & డామన్ మరియు డయ్యూ ఆవిర్భావ దినోత్సవం
- వణికిపోతున్న అమెరికా..15 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ
- స్పేస్కు వెళ్లినప్పుడు ఒక కొత్త విషయం కనిపించింది: సునితా విలియమ్స్
- అమెరికాలో నలుగురు భారత సంతతి వ్యక్తుల హత్య
- కువైట్ లో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- బహ్రెయిన్ లో రోడ్డు ప్రమాదం..చిన్నారి సహా ముగ్గురు మృతి..!!
- చలి కుంపట్ల పై కువైట్ ఫైర్ ఫోర్స్ వార్నింగ్..!!







