అబుదాబి విమానానికి బాంబు బెదిరింపు కేసు.. 22 ఏళ్ల వ్యక్తికి 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- June 06, 2025
యూఏఈ: అబుదాబి వెళ్తున్న విమానంలో బాంబు పెట్టినట్టు బెదిరింపులకు పాల్పడిన సింగపూర్లోని 22 ఏళ్ల వ్యక్తికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష, $50,000 (Dh183,500) వరకు జరిమానా విధించారు. ఆ యువకుడు ఫిబ్రవరి 14, 2025న సింగపూర్లో అబుదాబికి వెళ్లే విమానం ఎక్కిన తర్వాత తన సోషల్ మీడియా ఖాతాలో " విమానాన్ని పేల్చివేయబోతున్నాను " అని ఒక పోస్ట్ పెట్టాడు.
విమానాన్ని పేల్చివేస్తామనే బెదిరింపుతో కూడిన సోషల్ మీడియా పోస్ట్ గురించి తమకు సమాచారం అందిందని, పోస్ట్ చేసిన గంటలోనే ఆ వ్యక్తిని గుర్తించగలిగామని, ఆ వ్యక్తి అబుదాబికి వెళ్లే విమానంలో ఉన్నాడని నిర్ధారించామని సింగపూర్ పోలీస్ ఫోర్స్ తెలిపింది. "అప్పటికే రన్వేపై టేకాఫ్ అవ్వబోతున్న ఆ విమానాన్ని చాంగి విమానాశ్రయ టెర్మినల్ 2కి మళ్ళించారు. అక్కడ ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. విమానం ఎక్కిన తర్వాత అతను తన సోషల్ మీడియా ఖాతాలో 'నేను విమానాన్ని పేల్చివేస్తానని ఇక్కడ ఎవరికీ తెలియదు' అని పోస్ట్ చేసినట్లు దర్యాప్తులో తేలింది. అతని వద్ద ఎటువంటి బెదిరింపు వస్తువులు గుర్తించలేదని సింగపూర్ పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా సమ్మేళనం..!!
- అర్హతలు,వృత్తుల సవరణకు కార్మికులకు కువైట్ అనుమతి..!!
- 2023 తర్వాత ఒమన్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు..!!
- గౌహతి నుండి దుబాయ్, అబుదాబికి డైరెక్ట్ ఫ్లైట్స్..!!
- పబ్లిక్ పార్కులలో 12 వాణిజ్య కార్యకలాపాలకు సౌదీ అనుమతి..!!
- ఖతార్ లో లుసైల్ ట్రామ్ సేవలు నిలిపివేత..!!
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..







