రికార్డ్ స్థాయిలో 5 లక్షల మందితో యోగాడే నిర్వహించనున్నాం: హోం మంత్రి అనిత
- June 10, 2025
విశాఖపట్నం: విశాఖలో జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి అనిత అన్నారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ… ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ యోగాడేకి హాజరవుతారని తెలిపారు.
విశాఖ బీచ్ రోడ్డులో 5 లక్షల మందితో యోగా డే రికార్డ్ స్థాయిలో జరుగుతుందని అనిత తెలిపారు. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మందితో యోగా చేయించేలా సీఎం చంద్రబాబు ప్లాన్ చేశారని అన్నారు. బీచ్ రోడ్డులో 33 బ్లాకుల్లో యోగా డే జరుగుతుందని తెలిపారు.
వర్షాలు కురిసినా సరే ఇబ్బంది లేకుండా ప్రణాళికలు రూపొందించామని అనిత చెప్పారు. వర్షం పడితే ఆల్టర్నేట్ వేదికగా ఆంధ్రా యూనివర్సిటీలో గ్రౌండ్స్ ను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. యోగాడే నిర్వహణకు ప్లాన్ ఏ, ప్లాన్ బీని కూడా వేసుకున్నామని చెప్పారు.
అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో సమర్థవంతంగా జరుపుతామని అనిత తెలిపారు. 10 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. 11వ యోగ దినోత్సవాన్ని విశాఖలో జరిపి సరికొత్త రికార్డు నెలకొల్పుతామని చెప్పారు.
తాజా వార్తలు
- నేటి నుంచి గుణదల మేరీమాత ఉత్సవాలు
- ఖతార్ లో వెయ్యి వస్తువుల ధరలు తగ్గింపు..!!
- మస్కట్ లో INSV కౌండిన్యకు ఘనంగా వీడ్కోలు..!!
- 2025లో సౌదీలో రెమిటెన్స్ రికార్డు..15శాతం వృద్ధి..!!
- ట్రాఫిక్ కు చెక్..అల్ ఖుద్రాలో కొత్త 4-లేన్ల బ్రిడ్జి ప్రారంభం..!!
- సల్మానియా మెడికల్ కాంప్లెక్స్లో అగ్నిప్రమాదం..తప్పిన పెనుప్రమాదం..!!
- ఫహాహీల్ ఎక్స్ ప్రెస్వే ఫాస్ట్ లేన్ 15 రోజుల పాటు మూసివేత..!!
- పోస్టాఫీస్లో అద్భుతమైన స్కీమ్..
- నోబెల్ గ్రహీత నర్గెస్కు మరో ఏడున్నరేళ్ల జైలు
- భారత దేశంలో తొలి సమగ్ర అవయవ మార్పిడి సంస్థ









