రికార్డ్ స్థాయిలో 5 లక్షల మందితో యోగాడే నిర్వహించనున్నాం: హోం మంత్రి అనిత
- June 10, 2025
విశాఖపట్నం: విశాఖలో జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి అనిత అన్నారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ… ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ యోగాడేకి హాజరవుతారని తెలిపారు.
విశాఖ బీచ్ రోడ్డులో 5 లక్షల మందితో యోగా డే రికార్డ్ స్థాయిలో జరుగుతుందని అనిత తెలిపారు. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మందితో యోగా చేయించేలా సీఎం చంద్రబాబు ప్లాన్ చేశారని అన్నారు. బీచ్ రోడ్డులో 33 బ్లాకుల్లో యోగా డే జరుగుతుందని తెలిపారు.
వర్షాలు కురిసినా సరే ఇబ్బంది లేకుండా ప్రణాళికలు రూపొందించామని అనిత చెప్పారు. వర్షం పడితే ఆల్టర్నేట్ వేదికగా ఆంధ్రా యూనివర్సిటీలో గ్రౌండ్స్ ను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. యోగాడే నిర్వహణకు ప్లాన్ ఏ, ప్లాన్ బీని కూడా వేసుకున్నామని చెప్పారు.
అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో సమర్థవంతంగా జరుపుతామని అనిత తెలిపారు. 10 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. 11వ యోగ దినోత్సవాన్ని విశాఖలో జరిపి సరికొత్త రికార్డు నెలకొల్పుతామని చెప్పారు.
తాజా వార్తలు
- డాలస్ లో మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
- ప్రారంభమైన టెలిగ్రామ్ సేవలు
- ఇరాన్ ఆయిల్ పై ఆంక్షలు ఎత్తేసిన అమెరికా
- భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా సమ్మేళనం..!!
- అర్హతలు,వృత్తుల సవరణకు కార్మికులకు కువైట్ అనుమతి..!!
- 2023 తర్వాత ఒమన్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు..!!
- గౌహతి నుండి దుబాయ్, అబుదాబికి డైరెక్ట్ ఫ్లైట్స్..!!
- పబ్లిక్ పార్కులలో 12 వాణిజ్య కార్యకలాపాలకు సౌదీ అనుమతి..!!
- ఖతార్ లో లుసైల్ ట్రామ్ సేవలు నిలిపివేత..!!
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..







