టిటిడి చైర్మన్ బీఆర్ నాయుడుని కలిసిన ఎమ్మెల్సీ కవిత
- June 19, 2025
హైదరాబాద్: తిరుపతి హతిరామ్ బావాజీ మఠంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన బంజారా పీఠాధిపతులకు పూజలు చేసే అవకాశం కల్పించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును కోరారు.
తెలంగాణలోని వివిధ బంజారా పీఠాధిపతులతో కలిసి గురువారం హైదరాబాద్లో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును ఆమె మర్యాదపూర్వకంగా కలిసారు.
ఈ నెల 30న జరగనున్న హతిరామ్ బావాజీ జయంతిని పురస్కరించుకుని, బంజారా (సుగాలి, లంబాడీ) పీఠాధిపతులు, పూజారులకు మఠంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించే అవకాశం కల్పించడంతో పాటు, నైవేద్యం సమర్పించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
ఈ నేపథ్యంలో త్వరలోనే హతిరామ్ బావాజీ పీఠం నిర్వాహకులు మరియు గిరిజన పీఠాధిపతులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు హామీ ఇచ్చారు.
హరిరామ్ బావాజీ మఠంలో పూజలు చేయడం, హారతి ఇవ్వడం వంటి అంశాలపై త్వరలో జరగనున్న సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
జయంతి రోజైన 30న ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు, నైవేద్యం సమర్పించేందుకు అనుమతి ఇస్తామని టీటీడీ చైర్మన్ హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- గల్ఫ్ పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..







