టిటిడి చైర్మన్ బీఆర్ నాయుడుని కలిసిన ఎమ్మెల్సీ కవిత
- June 19, 2025
హైదరాబాద్: తిరుపతి హతిరామ్ బావాజీ మఠంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన బంజారా పీఠాధిపతులకు పూజలు చేసే అవకాశం కల్పించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును కోరారు.
తెలంగాణలోని వివిధ బంజారా పీఠాధిపతులతో కలిసి గురువారం హైదరాబాద్లో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును ఆమె మర్యాదపూర్వకంగా కలిసారు.
ఈ నెల 30న జరగనున్న హతిరామ్ బావాజీ జయంతిని పురస్కరించుకుని, బంజారా (సుగాలి, లంబాడీ) పీఠాధిపతులు, పూజారులకు మఠంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించే అవకాశం కల్పించడంతో పాటు, నైవేద్యం సమర్పించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
ఈ నేపథ్యంలో త్వరలోనే హతిరామ్ బావాజీ పీఠం నిర్వాహకులు మరియు గిరిజన పీఠాధిపతులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు హామీ ఇచ్చారు.
హరిరామ్ బావాజీ మఠంలో పూజలు చేయడం, హారతి ఇవ్వడం వంటి అంశాలపై త్వరలో జరగనున్న సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
జయంతి రోజైన 30న ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు, నైవేద్యం సమర్పించేందుకు అనుమతి ఇస్తామని టీటీడీ చైర్మన్ హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..