టెండూల్కర్-ఆండర్సన్ ట్రోఫీ ఆవిష్కరణ!!
- June 19, 2025
ఇంగ్లండ్-భారత్ టెస్ట్ సిరీస్కు కొత్త రూపు దక్కింది. ఇకపై ఈ ప్రతిష్టాత్మక సిరీస్ను “టెండూల్కర్-ఆండర్సన్ ట్రోఫీ”గా పిలవనున్నారు.రెండు దశాబ్దాలకు పైగా తమ తమ దేశాలకు సేవలందించిన భారత బ్యాట్స్మన్ సచిన్ టెండూల్కర్–ఇంగ్లాండ్ స్వింగ్ లెజెండ్ జేమ్స్ ఆండర్సన్ లకు ఈ ట్రోఫీ రూపంలో అరుదైన గుర్తింపు లభించింది.
ఈరోజు (జూన్ 19న) జరిగిన ఆవిష్కరణ కార్యక్రమంలో సచిన్, ఆండర్సన్ కలిసి కొత్త ట్రోఫీతో ఫోటో దిగారు.ఈ కొత్త ట్రోఫీ రెండు దేశాల మధ్య ఉన్న క్రికెట్ వారసత్వానికి, పరస్పర గౌరవానికి ప్రతీకగా నిలవనుంది.
ఈ నేపధ్యంలో, ఇంతవరకు ఇంగ్లండ్లో జరిగిన భారత్ టెస్ట్ సిరీస్లకు వర్తించిన పటౌడి ట్రోఫీకి ముగింపు పలికారు.అయితే, మన్సూర్ అలీ ఖాన్ పటౌడి జ్ఞాపకార్థం ‘పటౌడి మెడల్’ అనే ప్రత్యేక అవార్డును ECB ప్రవేశపెట్టింది.ఇక నుంచి భారత్-ఇంగ్లాండ్ సిరీస్లో విజేత జట్టు కెప్టెన్కు ఈ మెడల్ అందించనున్నారు.
ఈ సందర్భంగా…యువ భారత జట్టుకు సచిన్ టెండూల్కర్ విలువైన సూచనలు చేశాడు. ఇంగ్లండ్ వాతావరణంలో ఆటగాళ్లు శాంతియుతంగా, ఓపికగా ఆడాలని….స్వింగ్, బౌన్స్కు తగిన విధంగా తమ ఆటను మలచుకోవాలని సూచించాడు.ఇక జూన్ 20న లీడ్స్ వేదికగా జరగబోయే మొదటి టెస్ట్తో టెండూల్కర్-ఆండర్సన్ ట్రోఫీ ప్రారంభం కానుంది.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







