టెండూల్కర్-ఆండర్సన్ ట్రోఫీ ఆవిష్కరణ!!
- June 19, 2025
ఇంగ్లండ్-భారత్ టెస్ట్ సిరీస్కు కొత్త రూపు దక్కింది. ఇకపై ఈ ప్రతిష్టాత్మక సిరీస్ను “టెండూల్కర్-ఆండర్సన్ ట్రోఫీ”గా పిలవనున్నారు.రెండు దశాబ్దాలకు పైగా తమ తమ దేశాలకు సేవలందించిన భారత బ్యాట్స్మన్ సచిన్ టెండూల్కర్–ఇంగ్లాండ్ స్వింగ్ లెజెండ్ జేమ్స్ ఆండర్సన్ లకు ఈ ట్రోఫీ రూపంలో అరుదైన గుర్తింపు లభించింది.
ఈరోజు (జూన్ 19న) జరిగిన ఆవిష్కరణ కార్యక్రమంలో సచిన్, ఆండర్సన్ కలిసి కొత్త ట్రోఫీతో ఫోటో దిగారు.ఈ కొత్త ట్రోఫీ రెండు దేశాల మధ్య ఉన్న క్రికెట్ వారసత్వానికి, పరస్పర గౌరవానికి ప్రతీకగా నిలవనుంది.
ఈ నేపధ్యంలో, ఇంతవరకు ఇంగ్లండ్లో జరిగిన భారత్ టెస్ట్ సిరీస్లకు వర్తించిన పటౌడి ట్రోఫీకి ముగింపు పలికారు.అయితే, మన్సూర్ అలీ ఖాన్ పటౌడి జ్ఞాపకార్థం ‘పటౌడి మెడల్’ అనే ప్రత్యేక అవార్డును ECB ప్రవేశపెట్టింది.ఇక నుంచి భారత్-ఇంగ్లాండ్ సిరీస్లో విజేత జట్టు కెప్టెన్కు ఈ మెడల్ అందించనున్నారు.
ఈ సందర్భంగా…యువ భారత జట్టుకు సచిన్ టెండూల్కర్ విలువైన సూచనలు చేశాడు. ఇంగ్లండ్ వాతావరణంలో ఆటగాళ్లు శాంతియుతంగా, ఓపికగా ఆడాలని….స్వింగ్, బౌన్స్కు తగిన విధంగా తమ ఆటను మలచుకోవాలని సూచించాడు.ఇక జూన్ 20న లీడ్స్ వేదికగా జరగబోయే మొదటి టెస్ట్తో టెండూల్కర్-ఆండర్సన్ ట్రోఫీ ప్రారంభం కానుంది.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







