జులై 24 న విడుదల కానున్న ‘హరిహర వీరమల్లు’
- June 21, 2025
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు శుభవార్త! ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘హరిహర వీరమల్లు: పార్ట్ 1- స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ చిత్రం జూలై 24వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించడంతో అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. వాస్తవానికి, ఈ భారీ బడ్జెట్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా జూన్ 12న విడుదల కావాల్సి ఉండగా, కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఇప్పుడు కొత్త విడుదల తేదీ ఖరారు కావడంతో పవన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా ప్రారంభమైనప్పటి నుంచి పలుమార్లు విడుదల వాయిదా పడుతూ వచ్చింది. పవన్ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనడం, ఇతర షెడ్యూల్స్ వంటి కారణాల వల్ల చిత్రీకరణ ఆలస్యమైంది. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో కొంత భాగం చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా బాధ్యతలను ఆ తర్వాత నిర్మాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ చేపట్టారు. ఈ చిత్రం కోసం పవన్ కల్యాణ్ పడిన శ్రమ, చూపించిన అంకితభావం అసాధారణం.
పవన్ కల్యాణ్ తన రాజకీయ, వ్యక్తిగత షెడ్యూల్స్ మధ్య కూడా ‘హరిహర వీరమల్లు’ చిత్రం కోసం అత్యంత శ్రద్ధ తీసుకున్నారు. సినిమా చిత్రీకరణ ఆలస్యం కావడం, సెట్స్ పై ఎక్కువ కాలం ఉండటంతో నిర్మాత ఏఎం రత్నంపై ఆర్థిక భారం పడిందని భావించిన పవన్, తాను అడ్వాన్స్ గా తీసుకున్న పారితోషికాన్ని పూర్తిగా వెనక్కి ఇచ్చేసినట్లు సమాచారం. ఇది చిత్ర పరిశ్రమలో అరుదైన, ప్రశంసనీయమైన చర్యగా నిలుస్తుంది. కేవలం పారితోషికం వెనక్కి ఇవ్వడమే కాకుండా, తన బిజీ షెడ్యూల్ మధ్య కూడా సినిమా పనుల కోసం ప్రత్యేక సమయం కేటాయించారు. చిత్ర వర్గాల సమాచారం ప్రకారం, పవన్ రాత్రి 10 గంటలకు డబ్బింగ్ పనులు మొదలుపెట్టి, ఏకధాటిగా నాలుగు గంటల్లో పూర్తి చేశారని తెలుస్తోంది. ఇది ఆయన పని పట్ల చూపించే నిబద్ధతకు నిదర్శనం. ఒక గొప్ప పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో శక్తివంతమైన చారిత్రక యోధుడి పాత్రను పోషిస్తున్న పవన్, ఈ సినిమా కోసం మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారు. ఈ సినిమాలో వచ్చే ‘అసుర హననం’ పాటలోని పోరాట సన్నివేశాలను పవన్ కల్యాణే స్వయంగా డిజైన్ చేశారని దర్శకుడు జ్యోతికృష్ణ గతంలో ఒక సందర్భంలో వెల్లడించారు. ఈ వివరాలు సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







