హైదరాబాద్ పాస్పోర్టు కార్యాలయానికి అరుదైన పురస్కారం
- June 24, 2025
హైదరాబాద్: హైదరాబాద్ ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయం మరోసారి దేశస్థాయిలో తమ సేవా నిబద్ధతను చాటింది. ఢిల్లీలో జరిగిన 13వ పాస్పోర్టు సేవా దినోత్సవ కార్యక్రమంలో భాగంగా 2024-25 సంవత్సరానికి గాను ‘సంస్కరణలు, ప్రజా సేవపట్ల నిబద్ధత’ విభాగంలో హైదరాబాద్ ఆర్పీవోకు కేంద్ర విదేశాంగ శాఖ ప్రతిష్టాత్మక అవార్డును ప్రదానం చేసింది. ఈ అవార్డును కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గెరిటా అందించగా, హైదరాబాద్ ఆర్పీవో అధికారిణి జొన్నలగడ్డ స్నేహజ, ఆర్పీవో తరఫున ఈ గౌరవాన్ని స్వీకరించారు. ప్రజల అవసరాల మేరకు సేవల సరళీకరణ, సమర్థవంతమైన కార్యాచరణకు ఇది గుర్తింపుగా నిలిచింది.
తెలంగాణ పోలీసులకు కేంద్రం ప్రశంస
పాస్పోర్టు వెరిఫికేషన్ ప్రక్రియలో వేగవంతమైన, పారదర్శక సేవలందించినందుకు తెలంగాణ పోలీసు విభాగానూ ఈ సందర్భంగా అవార్డుతో సత్కరించారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన డీజీ బత్తుల శివధర్ రెడ్డి ఈ అవార్డును స్వీకరించారు. ఆధునిక సాంకేతికతను వినియోగించి, పౌరులకు నాణ్యమైన సేవలు అందించడంలో తెలంగాణ పోలీసులు చూపిన చొరవకు ఇది ఫలితంగా భావిస్తున్నారు. పోలీసు వ్యవస్థపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని మరింత పెంపొందించేలా ఈ గుర్తింపు తోడ్పడనుంది.
పాస్పోర్టు సేవల విభాగంలో తెలంగాణకే రెండు గౌరవాలు
ఈ అవార్డులతో తెలంగాణ రాష్ట్రానికి రెండు కీలక గౌరవాలు దక్కాయి. ఒకటి ప్రజా సేవలలో ముందుండే హైదరాబాద్ ఆర్పీవోకు, మరొకటి పాస్పోర్టు దరఖాస్తుల పరిశీలనలో నాణ్యతను ప్రదర్శించిన రాష్ట్ర పోలీసులకు. ఈ అవార్డులు రాష్ట్రంలో ప్రశాసన వ్యవస్థలో పారదర్శకత, సమర్థత ఎంత పెరిగిందో తెలుపుతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. కేంద్రంతో సమన్వయం, సాంకేతిక వినియోగం, సేవా నిబద్ధతలో ఈ గుర్తింపులు తెలంగాణను దేశంలో ఆదర్శంగా నిలబెట్టాయి.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







