అంతరిక్ష యాత్రకు తెలుగమ్మాయి..
- June 24, 2025
అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లా పలకొల్లు పట్టణానికి చెందిన 23 ఏళ్ల యువతి జ్ఞానవి డంగేటి, భారతీయ మహిళల ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో ప్రతినిధ్యం వహిస్తూ అరుదైన ఘనతను సాధించింది. ఆమెను అమెరికాలోని ప్రైవేట్ అంతరిక్ష పరిశోధనా సంస్థ టైటన్ స్పేస్ ఇండస్ట్రీస్ (TSI) నిర్వహించే 2029 అంతరిక్ష యాత్రకు వ్యోమగామిగా అధికారికంగా ఎంపిక అయ్యారు. ఈ సందర్భంగా సంస్థ ఒక ప్రకటనను విడుదల చేసింది.
TSI చేపట్టే ఈ అంతరిక్ష మిషన్ 2029లో జరగనుండగా, ఆమె 2026 నుంచి మూడు సంవత్సరాల పాటు శిక్షణ పొందనుంది. ఈ శిక్షణలో స్పేస్షిప్ ఆపరేషన్స్, ఫ్లైట్ సిమ్యూలేషన్, మెడికల్-సైకాలజికల్ ట్రైనింగ్, లైఫ్ సపోర్ట్, సర్వైవల్ టెక్నిక్స్ వంటి అత్యంత క్లిష్టమైన అంశాలు ఉంటాయి.
ఈ మిషన్కు NASA మాజీ వ్యోమగామి కల్నల్ విలియమ్ మెక్ ఆర్థర్ జూనియర్ ప్రధాన వ్యోమగామిగా వ్యవహరించనున్నారు. మొత్తం ఐదు గంటల వ్యాసంలో నిర్వహించే ఈ ఆర్బిటల్ ఫ్లైట్, శాస్త్రీయ ప్రయోగాలు, మానవ అంతరిక్ష ప్రయాణ అభివృద్ధికి దోహదపడే విధంగా రూపొందించబడుతోంది.
విజయం వెనుక ప్రయాణం..
ప్రస్తుతం కువైట్లో నివసిస్తున్న పద్మశ్రీ–శ్రీనివాస్ దంపతుల కుమార్తె అయిన జ్ఞానవికి చిన్ననాటి నుంచే అంతరిక్షంపై గొప్ప ఆసక్తి. గోదావరి జిల్లాలో పాఠశాల విద్య అనంతరం, పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (LPU)లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్లో బి.టెక్ పూర్తిచేసింది.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!