Axiom-4 Mission : 40 ఏళ్ల తర్వాత మరో భారతీయుడు అంతరిక్షంలోకి
- June 25, 2025
నాసా ఆధ్వర్యంలో చేపట్టిన స్పేస్ఎక్స్ యాక్సియం-4 మిషన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా విజయవంతమైంది. ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్-9 రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి ప్రయాణించిన ఈ మిషన్లో భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా కీలక సభ్యుడిగా ఉన్నారు. ఈ మిషన్కు సంబంధించిన లాంచ్ ముందుగా ఆరు సార్లు వాయిదా పడగా, ఎట్టకేలకు ఇది విజయవంతంగా నింగిలోకి ఎగిరింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం లో 14 రోజులపాటు శాస్త్రీయ పరిశోధనలు చేయడం ఈ మిషన్ ముఖ్య ఉద్దేశ్యం.
40 ఏళ్ల తర్వాత మరో భారతీయుడు అంతరిక్షంలోకి
1984లో రాకేశ్ శర్మ తర్వాత తొలిసారిగా భారత్కు చెందిన మరో వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రకు సిద్ధమవడం ఎంతో గర్వకారణం. ఈ ఘట్టం 140 కోట్ల భారతీయుల గర్వాన్ని వ్యక్తపరుస్తోంది. ఫాల్కన్ స్పేస్క్రాఫ్ట్లో శుభాంశుతో పాటు మరో ముగ్గురు అంతరిక్ష ప్రయాణికులు కలిసి బయల్దేరారు. ఈ విజయంతో భారత అంతరిక్ష ప్రస్థానం మరో కీలక మైలురాయిని దాటిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
భావోద్వేగానికి లోనైన తల్లి
శుభాంశు అంతరిక్ష ప్రయాణానికి బయలుదేరిన వెంటనే, అతని తల్లిదండ్రులు భావోద్వేగానికి లోనయ్యారు. నింగిలోకి తన కొడుకు ప్రయాణించిన దృశ్యం చూసిన తల్లి కన్నీళ్లు పెట్టుకుంది. అతని స్వగ్రామంలో జైహింద్ నినాదాలతో, బ్యాండ్ వాయిద్యాలతో వేడుకలు జరిపారు. అంతరిక్ష కేంద్రం నుంచి తొలిసారి మాట్లాడిన శుభాంశు – “ఇది కేవలం నా ప్రయాణం కాదు, ఇది భారత్ స్పేస్ ప్రయాణానికి నూతన దిక్సూచి. మనం కలసి విజయాన్ని సాధించాలి. జై హింద్.. జై భారత్” అని ప్రజలను ఉత్సాహపరిచాడు.
తాజా వార్తలు
- గల్ఫ్ పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..







