మూడు నెలలపాటు నిఘా నీడలో ఫ్రాన్స్..
- July 14, 2016ఫ్రాన్స్ లో మరో దాడి జరిగిన నేపథ్యంలో అత్యవసర పరిస్థితిని ఆ దేశ అధ్యక్షుడు హోలాండే మరో మూడు నెలలపాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేందుకుగాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. గత ఏడాది నవంబర్ లో పారిస్ నగరంలో పై ఉగ్రవాదులు విరుచుకుపడి దాదాపు 130మందిని బలిగొన్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ లో అత్యవసర పరిస్థితిని విధించారు. ప్రస్తుతం అది కొనసాగుతుంది కూడా. అయితే, తాజాగా ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం బాస్టిల్ డే సందర్భంగా మరోసారి ఉగ్రవాదులు నరమేధానికి పాల్పడ్డారు. నీస్ నగరంలో బాస్టిల్ డే ఉత్సవాల్లో పాల్గొన్న జనాలపైకి ట్రక్కు నడుపుతూ వారి ప్రాణాలు బలిగొన్నారు. ఈ ఘటనలో 80 మంది మృతి చెందగా.. 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో మరో మూడు నెలలు దేశంలో అత్యవసర పరిస్థితిని పొడిగిస్తున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్