మ్వాసలాత్ గ్రీన్ చొరవ..ప్రశంసలు కురిపిస్తున్న ప్రయాణికులు..!!
- July 14, 2025
మస్కట్: ముత్రా రూట్ నంబర్ నాలుగులో ప్రవేశపెట్టిన మ్వాసలాత్ ఎలక్ట్రిక్ బస్సు ప్రయోగం విజయవంతమైంది. పిల్లల నుండి వృద్ధుల వరకు ముత్రా కార్నిచ్కు ప్రయాణించడాన్ని ఆస్వాదిస్తున్నారు. సాధారణ సమయంలో అన్ని ప్రయాణీకులు అల్ ఆలం ప్యాలెస్లో దిగుతారు. కానీ గ్రీన్ చొరవ సందర్భంగా దాదాపు అందరూ బోర్డింగ్ పాయింట్లో దిగి మ్వాసలాత్ చొరవను ప్రశసించారు. గురువారం నుండి ఆదివారం వరకు ఈ రూట్ లో ఉచిత ప్రయాణాన్ని అందిస్తున్నారు. ఇందుకు గాను ప్రయాణీకులకు గ్రీన్ టికెట్ అందజేశారు. సాధారణ బస్సులు ఎరుపు రంగులో ఉన్నప్పటికీ, ఈ ఎలక్ట్రిక్ బస్సును ఆకుపచ్చ రంగులో పెయింట్ చేయించడంతో ఇది ప్రయాణికులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. కాలుష్య ఉద్గారాలను తగ్గించడమే లక్ష్యంగా గ్రీన్ బస్సులను ప్రవేశపెడుతున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త
- హైదరాబాద్ కి భారీ వర్షాల హెచ్చరిక..
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!







