మ్వాసలాత్ గ్రీన్ చొరవ..ప్రశంసలు కురిపిస్తున్న ప్రయాణికులు..!!
- July 14, 2025
మస్కట్: ముత్రా రూట్ నంబర్ నాలుగులో ప్రవేశపెట్టిన మ్వాసలాత్ ఎలక్ట్రిక్ బస్సు ప్రయోగం విజయవంతమైంది. పిల్లల నుండి వృద్ధుల వరకు ముత్రా కార్నిచ్కు ప్రయాణించడాన్ని ఆస్వాదిస్తున్నారు. సాధారణ సమయంలో అన్ని ప్రయాణీకులు అల్ ఆలం ప్యాలెస్లో దిగుతారు. కానీ గ్రీన్ చొరవ సందర్భంగా దాదాపు అందరూ బోర్డింగ్ పాయింట్లో దిగి మ్వాసలాత్ చొరవను ప్రశసించారు. గురువారం నుండి ఆదివారం వరకు ఈ రూట్ లో ఉచిత ప్రయాణాన్ని అందిస్తున్నారు. ఇందుకు గాను ప్రయాణీకులకు గ్రీన్ టికెట్ అందజేశారు. సాధారణ బస్సులు ఎరుపు రంగులో ఉన్నప్పటికీ, ఈ ఎలక్ట్రిక్ బస్సును ఆకుపచ్చ రంగులో పెయింట్ చేయించడంతో ఇది ప్రయాణికులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. కాలుష్య ఉద్గారాలను తగ్గించడమే లక్ష్యంగా గ్రీన్ బస్సులను ప్రవేశపెడుతున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- UAEU Concludes Participation in the Arab Media Summit 2026
- దుబాయ్లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!
- సౌదీ పోర్టుల్లో భారీగా పెరిగిన కంటైనర్ రవాణా..!!
- 14% వృద్ధి నమోదు చేసిన యూఏఈ బీమా రంగం..!!







