మ్వాసలాత్ గ్రీన్ చొరవ..ప్రశంసలు కురిపిస్తున్న ప్రయాణికులు..!!
- July 14, 2025
మస్కట్: ముత్రా రూట్ నంబర్ నాలుగులో ప్రవేశపెట్టిన మ్వాసలాత్ ఎలక్ట్రిక్ బస్సు ప్రయోగం విజయవంతమైంది. పిల్లల నుండి వృద్ధుల వరకు ముత్రా కార్నిచ్కు ప్రయాణించడాన్ని ఆస్వాదిస్తున్నారు. సాధారణ సమయంలో అన్ని ప్రయాణీకులు అల్ ఆలం ప్యాలెస్లో దిగుతారు. కానీ గ్రీన్ చొరవ సందర్భంగా దాదాపు అందరూ బోర్డింగ్ పాయింట్లో దిగి మ్వాసలాత్ చొరవను ప్రశసించారు. గురువారం నుండి ఆదివారం వరకు ఈ రూట్ లో ఉచిత ప్రయాణాన్ని అందిస్తున్నారు. ఇందుకు గాను ప్రయాణీకులకు గ్రీన్ టికెట్ అందజేశారు. సాధారణ బస్సులు ఎరుపు రంగులో ఉన్నప్పటికీ, ఈ ఎలక్ట్రిక్ బస్సును ఆకుపచ్చ రంగులో పెయింట్ చేయించడంతో ఇది ప్రయాణికులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. కాలుష్య ఉద్గారాలను తగ్గించడమే లక్ష్యంగా గ్రీన్ బస్సులను ప్రవేశపెడుతున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!
- షిర్డీని తాకని 'గ్యాస్ సెగలు'.. సోలార్ మాహాత్మ్యం
- సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: కొత్త అటెండెన్స్ రూల్స్ ఇవే
- ఐపీఎల్ జట్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026 SRH సీజన్ స్క్వాడ్
- రైతు ఉత్పత్తిదారుల సంస్థల పనితీరు గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!









