ఖతార్ లో కొత్తగా ఐదు ఇ-సేవలు..5.38% పెరిగిన లావాదేవీలు..!!
- July 18, 2025
దోహా: ఖతార్ వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MoCI) సింగిల్ విండో ప్లాట్ఫామ్ ఈ సంవత్సరం రెండవ త్రైమాసికంలో (Q2) ఐదు కొత్త ఎలక్ట్రానిక్ సేవలను ప్రారంభించింది. అదే సమయంలో ఎలక్ట్రానిక్ లావాదేవీలలో 5.38% పెరుగుదలను(త్రైమాసిక ప్రాతిపదికన) నమోదు చేసింది. ఈ మేరకు వాణిజ్య పరిశ్రమల మంత్రి హెచ్ ఇ షేక్ ఫైసల్ బిన్ థాని బిన్ ఫైసల్ అల్ థాని తన అధికారిక X ఖాతాలో ఒక పోస్ట్లో పేర్కొన్నారు.
2025 రెండవ త్రైమాసికంలో రిజిస్ట్రేషన్లు, లైసెన్స్లను పూర్తి చేయడానికి పట్టే సమయం రెండు రోజులకు తగ్గిందని (98% ఎలక్ట్రానిక్గా), 88% మంది కస్టమర్లు సింగిల్ విండో సేవలతో సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. అదే విధంగా సింగిల్ విండో ప్లాట్ఫామ్ 2025 రెండవ త్రైమాసికంలో ఐదు కొత్త ఇ-సేవలను ప్రారంభించిందని వెల్లడించారు. అన్ని సేవలను 100 శాతం డిజిటలైజేషన్ చేయడంతోపాటు 2030 వరకు 20 శాతం వార్షిక వృద్ధి రేటుతో పేటెంట్ల సంఖ్యను పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- చిన్నారి పై హత్యాచారం.. కాలు పై కాల్చి మృగాడిని పట్టుకున్న పోలీసులు
- నార్త్ అల్ బతినాలో 'మ్యాంగో ఎక్స్ట్రావాగంజా' ప్రారంభం..!!
- ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్.. గత సీజన్ రికార్డులు బ్రేక్..!!
- ఫీజులు లేవు.. దుబాయ్లో ఉచిత ఇండోర్ ఫిట్నెస్ ఏరియా గురించి తెలుసా?
- కువైట్ సైన్యం స్పెషల్ ఆపరేషన్..పేలుడు పదార్థాలు నిర్వీర్యం..!!
- సౌదీ అరేబియా పశ్చిమ తీరానికి డస్ట్ అలెర్ట్ జారీ..!!
- ICRF 'థర్స్ట్ క్వెంచర్స్ 2026' క్యాంపెయిన్ ప్రారంభం..!!
- గల్ఫ్ పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు







