ఖతార్ లో కొత్తగా ఐదు ఇ-సేవలు..5.38% పెరిగిన లావాదేవీలు..!!
- July 18, 2025
దోహా: ఖతార్ వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MoCI) సింగిల్ విండో ప్లాట్ఫామ్ ఈ సంవత్సరం రెండవ త్రైమాసికంలో (Q2) ఐదు కొత్త ఎలక్ట్రానిక్ సేవలను ప్రారంభించింది. అదే సమయంలో ఎలక్ట్రానిక్ లావాదేవీలలో 5.38% పెరుగుదలను(త్రైమాసిక ప్రాతిపదికన) నమోదు చేసింది. ఈ మేరకు వాణిజ్య పరిశ్రమల మంత్రి హెచ్ ఇ షేక్ ఫైసల్ బిన్ థాని బిన్ ఫైసల్ అల్ థాని తన అధికారిక X ఖాతాలో ఒక పోస్ట్లో పేర్కొన్నారు.
2025 రెండవ త్రైమాసికంలో రిజిస్ట్రేషన్లు, లైసెన్స్లను పూర్తి చేయడానికి పట్టే సమయం రెండు రోజులకు తగ్గిందని (98% ఎలక్ట్రానిక్గా), 88% మంది కస్టమర్లు సింగిల్ విండో సేవలతో సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. అదే విధంగా సింగిల్ విండో ప్లాట్ఫామ్ 2025 రెండవ త్రైమాసికంలో ఐదు కొత్త ఇ-సేవలను ప్రారంభించిందని వెల్లడించారు. అన్ని సేవలను 100 శాతం డిజిటలైజేషన్ చేయడంతోపాటు 2030 వరకు 20 శాతం వార్షిక వృద్ధి రేటుతో పేటెంట్ల సంఖ్యను పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!
- ఒమాన్ రియాల్ కు అగౌరవం..మహిళ అరెస్ట్..!!
- జనవరి 15 వరకు 36 నివాస ప్రాంతాలలో రోడ్ పనులు..!
- ఖతార్ లో 50వేలమంది విద్యార్థులకు టీడీఏపీ వ్యాక్సిన్..!!







