నరేంద్రమోదీ అధ్యక్షతన అంతర్రాష్ట్ర మండలి సమావేశం

- July 15, 2016 , by Maagulf
నరేంద్రమోదీ అధ్యక్షతన అంతర్రాష్ట్ర మండలి సమావేశం

ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన అంతర్రాష్ట్ర మండలి సమావేశం రాష్ట్రపతిభవన్‌లో శనివారం ఉదయం ప్రారంభమైంది. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, శాశ్వత సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు. పదేళ్ల తర్వాత జరుగుతున్న ఈ సమావేశంలో నాలుగు ప్రధాన ఎజెండాలపై చర్చించనున్నారు. కేంద్ర-రాష్ట్రాల సంబంధాలపై పుంఛి కమిషన్‌ సిఫారసుల పరిశీలన , ఆధార్‌ను గుర్తింపు కార్డుగా పరిగణించడంతోపాటు సబ్సిడీలు, ఇతర సేవలకు ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) కోసం వాడటంపైనా చర్చిస్తారు. పాఠశాల విద్యాప్రమాణాల పెంపు, మెరుగుదలపైనా చర్చ ఉంటుంది. వీటితోపాటు అంతర్గత భద్రతపై సమీక్షించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com