వన్డే ప్రపంచకప్ 2025కు కౌంట్డౌన్ స్టార్ట్..
- August 11, 2025
ముంబై: మహిళల వన్డే ప్రపంచకప్ 2025కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. భారత్, శ్రీలంక దేశాలు ఈ ప్రపంచకప్కు ఆతిథ్యం ఇస్తున్నాయి. సెప్టెంబర్ 30 నుంచి ఈ మెగా టోర్నీ జరగనుంది. ఈ నేపథ్యంలో 50 రోజుల కౌంట్ డౌన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐసీసీ అధ్యక్షుడు జైషా, బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా, మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, మిథాలీ రాజ్తో పాటు పలువురు మహిళా క్రికెటర్లు పాల్గొన్నారు.
8 దేశాలు ప్రపంచకప్ కోసం పోటీపడనున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ మెగాటోర్నీ ఆరంభ వేడుకలు జరగనున్నాయి.అయితే.. ఇటీవల అక్కడ తొక్కిసలాట చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో అక్కడ పెద్ద ఈవెంట్లకు అనుమతి ఇచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఒకవేళ వేడుకలు అక్కడ నిర్వహించలేని పరిస్థితులు ఉంటే.. ముంబైలోని వాంఖడే స్టేడియంలో నిర్వహించేలా బీసీసీఐ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







