వన్డే ప్రపంచకప్ 2025కు కౌంట్డౌన్ స్టార్ట్..
- August 11, 2025
ముంబై: మహిళల వన్డే ప్రపంచకప్ 2025కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. భారత్, శ్రీలంక దేశాలు ఈ ప్రపంచకప్కు ఆతిథ్యం ఇస్తున్నాయి. సెప్టెంబర్ 30 నుంచి ఈ మెగా టోర్నీ జరగనుంది. ఈ నేపథ్యంలో 50 రోజుల కౌంట్ డౌన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐసీసీ అధ్యక్షుడు జైషా, బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా, మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, మిథాలీ రాజ్తో పాటు పలువురు మహిళా క్రికెటర్లు పాల్గొన్నారు.
8 దేశాలు ప్రపంచకప్ కోసం పోటీపడనున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ మెగాటోర్నీ ఆరంభ వేడుకలు జరగనున్నాయి.అయితే.. ఇటీవల అక్కడ తొక్కిసలాట చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో అక్కడ పెద్ద ఈవెంట్లకు అనుమతి ఇచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఒకవేళ వేడుకలు అక్కడ నిర్వహించలేని పరిస్థితులు ఉంటే.. ముంబైలోని వాంఖడే స్టేడియంలో నిర్వహించేలా బీసీసీఐ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- 1 ట్రిలియన్ దిర్హమ్లను దాటిన దుబాయ్ బ్రాండ్ వాల్యూ..!!
- సముద్రంలో ఇద్దరిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!
- రిటర్న్ టికెట్లతో దుబాయ్లో ఉచిత హోటల్ బస..ఎమిరేట్స్ ప్రత్యేక సమ్మర్ ఆఫర్
- NEET పునఃపరీక్షలో మొత్తం 30 మంది అరెస్టు
- ఖతార్లో భారీ పేలుడు: 54 మందికి గాయాలు, 18 మంది గల్లంతు







