విశాఖకు సెమీ రింగ్ రోడ్!
- March 17, 2026
విశాఖపట్నం: విశాఖపట్నం అంతర్జాతీయ నగరంగా ఎదిగేందుకు ఏపీ ప్రభుత్వం మరో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది.భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుండి రాంబిల్లి నేవల్ ఆల్టర్నేటివ్ ఆపరేషనల్ బేస్–NAOB వరకు సుమారు 70 కిలోమీటర్ల మేర సెమీ రింగ్ రోడ్డు నిర్మించాలని కీలక నిర్ణయం తీసుకుంది.ఈ రహదారి భోగాపురం, ఆనందపురం, పెందుర్తి, సబ్బవరం గుండా రాంబిల్లిని కలుపుతుంది. విశాఖ మహానగర రద్దీని తగ్గించడంతో పాటు, ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇది ఒక మలుపుగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ ప్రాజెక్టు కేవలం రవాణా సౌకర్యానికే పరిమితం కాకుండా, విశాఖ చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా రియల్ ఎస్టేట్ పారిశ్రామికాభివృద్ధికి బాటలు వేయనుంది. భోగాపురం విమానాశ్రయం నుండి రాంబిల్లిలోని రక్షణ, పారిశ్రామిక కేంద్రాలకు వేగవంతమైన కనెక్టివిటీ లభించడం వల్ల లాజిస్టిక్స్ రంగం పుంజుకుంటుంది. ఐటీ సెంటర్లు, ఫార్మా సిటీ , పోర్ట్ ఆధారిత పరిశ్రమలకు ఈ సెమీ రింగ్ రోడ్డు వెన్నెముకగా నిలవనుంది.దీనివల్ల విశాఖ నగరం లోపలికి భారీ వాహనాల రాక తగ్గి, ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది.
తాజా వార్తలు
- ఖతార్లో ప్రయాణికుల మెడిసిన్స్ కు ఈ-పర్మిట్..!!
- ఆన్లైన్ ట్రావెల్ మోసాలపై ప్రయాణికులకు హెచ్చరిక..!!
- షేక్ ఈసా బ్రిడ్జిపై తాత్కాలికంగా ఒక లేన్ మూసివేత..!!
- బహ్రెయిన్ లో స్మాల్ బోట్స్ కు రిమోట్ టెక్నికల్ తనిఖీలు..!!
- కువైట్లో అక్రమ గర్భస్రావాల కేసు.. డాక్టర్ అరెస్ట్..!!
- జీసీసీ-యూరప్ పార్లమెంటరీ సమావేశం.. ప్రాంతీయ భద్రతపై ఆందోళన..!!
- సౌదీలో ఎండల తీవ్రత.. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు..!!
- యూఏఈలో కొత్త విద్యాసంవత్సరానికి భారీగా పెరిగిన ఖర్చులు..!!
- మూడు వారాల విరామం తర్వాత బహ్రెయిన్, కువైట్కు ఎతిహాద్ విమాన సర్వీసులు పునఃప్రారంభం
- వాహనదారులకు రవాణా శాఖ గుడ్న్యూస్







