ఉక్రెయిన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ టెలిఫోన్ సంభాషణ
- August 11, 2025
న్యూ ఢిల్లీ: రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో... భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో సోమవారం టెలిఫోన్ ద్వారా మాట్లాడారు. తాజా పరిణామాలపై చర్చిస్తూ.. శాంతి స్థాపనకు సంబంధించిన అంశాలపై ఇరువురూ స్పష్టమైన అభిప్రాయాలు పంచుకున్నారు. పూర్తి వివరాలు కథనం లోపల...
ఉక్రెయిన్లో తాజా పరిణామాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సోమవారం టెలిఫోన్ ద్వారా చర్చించారు. ఈ సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ తమ దేశ పరిస్థితులు, ఇటీవల జరిగిన పరిణామాలపై తన అభిప్రాయాలను భారత ప్రధానితో పంచుకున్నారు. ప్రాంతీయ పరిస్థితులు, యుద్ధ ప్రభావం, అంతర్జాతీయ సమాజం స్పందన వంటి అంశాలపై కూడా తన అభిప్రాయాలు వెల్లడించారు. సంభాషణలో ప్రధాని మోదీ.. ఉక్రెయిన్ సమస్యకు శాంతియుత పరిష్కారం సాధించే దిశగా భారతదేశం ఎప్పటికీ నిలకడైన, స్థిరమైన వైఖరిని పాటిస్తుందని మరోసారి స్పష్టం చేశారు. అలాగే.. త్వరగా దేశంలో శాంతియుత వాతావరణం ఏర్పడేందుకు సహాయపడే అన్ని ప్రయత్నాలకు భారత్ మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో అవసరమైన సహాయం అందించడానికి భారత్ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవడం, సాధ్యమైనంత తొందరగా శాంతి పునరుద్ధరించడమే తమ ప్రాధాన్యం అని మోదీ స్పష్టం చేశారు.
ఇరువురు నేతలు భారత్-ఉక్రెయిన్ ద్వైపాక్షిక భాగస్వామ్యం పురోగతిని రివ్యూ చేశారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక రంగం, విద్య, మానవతా సహాయం వంటి విభాగాల్లో సహకారాన్ని మరింత విస్తరించే దిశగా చర్చించారు. భవిష్యత్తులో కూడా ఇరువురూ సన్నిహితంగా సంప్రదింపులు కొనసాగించేందుకు అంగీకరించారు.
తాజా వార్తలు
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- 1 ట్రిలియన్ దిర్హమ్లను దాటిన దుబాయ్ బ్రాండ్ వాల్యూ..!!
- సముద్రంలో ఇద్దరిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!
- రిటర్న్ టికెట్లతో దుబాయ్లో ఉచిత హోటల్ బస..ఎమిరేట్స్ ప్రత్యేక సమ్మర్ ఆఫర్







