రమ్య తాత మధుసూదనాచారి మృతి..

- July 17, 2016 , by Maagulf
రమ్య తాత మధుసూదనాచారి మృతి..

చిన్నారి రమ్య కుటుంబంలో మరో విషాదం జరిగింది. సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రమ్య తాత మధుసూదనాచారి మృతిచెందారు. జులై 1న జరిగిన రోడ్డుప్రమాదంలో గాయపడ్డ మధుసూదనాచారి 18 రోజులపాటు మృత్యువుతో పోరాడి చికిత్స పొందుతు నేడు మృతిచెందారు. ఆరు గురు విద్యార్థులు మధ్యం సేవించి కారు రాష్‌డ్రైవింగ్‌ వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఇప్పటికే చిన్నారి రమ్య, బాబాయి రాజేష్‌ మృతిచెందడంతో పుట్టెడు శోకంలో ఉన్న ఆ కుటుంబానికి మధుసూదనాచారి మృతితో మరో దెబ్బ తగిలింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com